
ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడచిన 24 గంటల్లో 93,759 మంది నమూనాలు పరీక్షించగా 3,464 కొత్త కేసులు నమోదయ్యాయి. 35 మంది మృతి చెందారు. కరోనా నుంచి నిన్న 4,284 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 37,323 యాక్టివ్ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్ తెలిపింది. కొవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, తూర్పుగోదావరిలో నలుగురు మరణించారు.