నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఇస్తున్న కరోనా మందును ప్రభుత్వం నుంచి అనుమతి రావడంతో ఇవాళ పంపిణీ చేపట్టారు. సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన ప్రజలకు ఔషధాన్ని ఇస్తున్నారు. క్యూలో నిల్చున్న వారికి ఇబ్బందులు లేకుండా ఆనందయ్య సోదరుడు, బృందం మందును పంపిణీ చేస్తున్నారు. ఈ ఔషధం కోసం నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.