
దేశంలో వరుసగా నాలుగో రోజు మూడు లక్షలకు దిగువన కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పొలిస్తే కరోనా కేసులు కాస్త పెరిగినా మరణాలు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 2,76,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ గురువారం తెలిపింది. నాలుగు రోజుల తర్వాత దేశంలో 4వేలకు దిగువ మరణాలు రికార్డయ్యాయి. వైరస్ ప్రభావంతో కొత్తగా 3,874 మంది మరణించారు. తాజాగా 3,69,077 మంది బాధితులు కోలుకున్నారు. కొత్తగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,57,72,400కు చేరాయి. ఇప్పటి వరకు 2,23,55,440 మంది కోలుకున్నారు. మొత్తం 2,87,122 మంది బాధితులు మహమ్మారి సోకి ప్రాణాలు వదిలారు.