
ఇండియా, పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్ కు ముహూర్తం కుదిరింది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా అక్టోబర్ 24న తలపడనున్నట్లు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ వెల్లడించింది. దుబాయ్ లో ఇండియా, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 24నే ఈ మ్యాచ్ జరగనున్నట్లు ఐసీసీ వర్గాలు వెల్లడించాయని ఏఎన్ఐ స్పష్టం చేసింది. గత నెలలోనే ఈ టీ20 వరల్డ్ కప్ ఇండియాలో కాకుండా ఒమన్, యూఏఈల్లో జరగనుందని ఐసీసీ చెప్పిన విషయం తెలిసిందే.