spot_img
Homeఆంధ్రప్రదేశ్‌ప్రకాశంలో వైసిపి ఆకర్ష్ .... టిడిపి ఇక ఖాళీ!

ప్రకాశంలో వైసిపి ఆకర్ష్ …. టిడిపి ఇక ఖాళీ!

కొంత కాలంగా మూడు రాజధానులు, శాసన మండలి రద్దు వంటి అంశాలపై ద్రుష్టి సారిస్తున్న ముఖ్యమంత్రి వై ఎస్ జగనా మోహన్ రెడ్డి తిరిగి ప్రతిపక్ష నేతలను ఆకర్షించడం పట్ల దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తున్నది. ఒకొక్క జిల్లాల్లో ఆ పార్టీ బలాన్ని హరించే ప్రయత్నాలకు తిరిగి శ్రీకారం చుట్టారు. మొదటగా ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకి పట్టు లేకుండా చేయడం కోసం సిద్దపడిన్నట్లు చెబుతున్నారు.

ప్రకాశం జిల్లాలో టిడిపికి ఉన్న నలుగురు ఎమ్యెల్యేలలో టిడిపిలో అత్యంత బలమైన నేతగా పేరొందిన, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కారణం బలరామకృష్ణ మూర్తి ఇప్పటికే వైసిపి చెంత చేరారు. ఇక మిగిలిన ముగ్గురిని కూడా టిడిపికి దూరం చేయడం కోసం ముహర్తం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ నెల 30న ఆ విధంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణం చేసి మే 30 తేదీ నాటికి ఏడాది అవుతుంది. అదే రోజు నాటికి ప్రకాశం జిల్లాలో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలనూ వైసిపిలోకి చేర్చుకొంటే జిల్లాలో టిడిపి మొత్తం ఖాళీ అవుతుంది అని వైసిపి వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. గత ఎన్నికల్లో టిడిపికి 23 స్థానాలు వచ్చిన సంగతి తెలిసిందే. అందులోనూ ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు జంప్‌ అయ్యారు.

మరో ముగ్గురిని వైసిపి తీర్థం పుచ్చుకునేలా చేస్తే శాసన సభలో టిడిపికి ప్రతిపక్ష హోదా కూడా ఉండదు. అందులో భాగంగానే జిల్లాలోని టిడిపి ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు గాలం వేస్తూ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. అందుబాటులో, టచ్‌లో ఉన్న టిడిపి నేతలతో మంతనాలు మొదలుపెట్టినట్లు చెబుతున్నారు.

వైసిపిలో చేరాలంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనే నిబంధన ఉండటంతో టిడిపి ఎమ్యెల్యేలు ప్రధానంగా వెనుకడుగు వేస్తున్నారు. అందులో చేరినా మంత్రి పదవులు వచ్చే అవకాశం లేదు గదా అంటూ పెదవి విరుస్తున్నారు. అయితే టిడిపిలో కొనసాగితే వ్యాపార పరంగా, పోలీసుల పరంగా వేధింపులకు గురికావలసి వస్తుందని భయపడవలసి వస్తున్నది. కేవలం రక్షణ కోసమే అధికార పక్షంలో చేరుతున్నట్లు స్పష్టం అవుతున్నది.

రాజకీయ ప్రత్యర్థులనే కాకుండా సొంతపార్టీలో సహితం తన మాట వినని వారిపై దూడకుడుగా వ్యవహరిస్తూ అనేక హింసాయుత సంఘటనలకు కారకుడిగా ఆరోపణలు ఎదుర్కొన్న కారణం బలరామకృష్ణ మూర్తి వంటివారు సహితం వైసిపి ప్రభుత్వంలో దౌర్జన్యాలను ఎదుర్కొనలేక దాసోహం కావలసి రావడం గమనార్హం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Dharmendra Pradhan : ఇది విద్యార్థుల విజయం ప్రజాస్వామ్య విజయం

Dharmendra Pradhan : ప్రజాస్వామ్యంలో ప్రజల స్వరం, ముఖ్యంగా యువత గొంతు, పాలకులను నిర్ణయాలు మార్చుకునేలా చేయగలదని మరోసారి రుజువైంది. దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణపై వ్యక్తమైన అసంతృప్తి, వరుసగా ప్రశ్నాపత్రాల లీకేజీ...
OnePlus N6x

OnePlus N6x: ఒక్కసారి చార్జింగ్ చేస్తే 2.5 రోజుల బ్యాటరీ బ్యాకప్.. ధర రూ.20 వేల లోపే..

OnePlus N6x: ప్రస్తుత కాలంలో మొబైల్ వాడకం పెరిగిపోయింది.దీంతో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ కావాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. వీరికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ప్రత్యేకంగా బ్యాటరీ బ్యాకప్ విషయంలో ఫోకస్ పెడుతున్నారు. ఇప్పటి...
POCO M8 Power

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...
Honda CB500

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...
Social Companionship

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...
Oktelugu Epaper