Homeజాతీయ వార్తలుSankranthi Kodi Pandalu : పట్టంటే దీనిదే.. లక్కంటే యజమానిదే.. పందెంలో కోటి గెలిచిన కోడి

Sankranthi Kodi Pandalu : పట్టంటే దీనిదే.. లక్కంటే యజమానిదే.. పందెంలో కోటి గెలిచిన కోడి

Sankranthi Kodi Pandalu : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్రాంతి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. అయితే, ఉమ్మడి గోదావరి, కృష్ణా జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో సంక్రాంతి వేడుకల పేరుతో కోడి పందాలు, క్యాసినోలు, జూదం నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో జరిగిన కోడి పందాల కార్యక్రమాల నిర్వాహకులు లేడీ బౌన్సర్లను ఏర్పాటు చేశారు. ఈ విషయానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఏపీలో కోడి పందాల జోరు హోరా హోరీగా కొనసాగుతోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో పందెం కోళ్లు కాళ్లకు కత్తులు కట్టుకుని కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. అటు పందెంరాయుళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొంటున్నారు. తాజాగా.. కోడి పందాలపై భారీగా బెట్టింగ్ పెట్టారు. ఏకంగా కోటి రూపాయలకు పైగా పందెం కాశారు.

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కోడిపుంజుపై రూ.కోటి పందెం కాశారు. గుడివాడ ప్రభాకర్ రావు నెమలి పుంజును, రాతయ్య రసంగి పుంజును బరిలో దింపారు. కోటి 25 లక్షలతో రెండు పుంజులను నిర్వాహకులు బరిలోకి దింపారు. కోటి రూపాయల పందాన్ని వీక్షించడానికి పందెం రాయళ్లు భారీ ఎత్తున తరలివచ్చారు. హోరా హోరిగా సాగిన పోరులో.. గుడివాడ ప్రభాకర్ (నెమలి పుంజు) విజేతగా నిలిచింది.

భోగి, సంక్రాంతి రోజుల్లో జోరుగా సాగిన కోడి పందాలు.. కనుమ రోజు కూడా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా గోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని చాలా ప్రాంతాల్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. లక్షలు, కోట్ల రూపాయల పందెం కాస్తున్నారు. ఈ పందేలను చూడటానికి హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. పలుచోట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సందడి చేశారు. కోడి పందాలు చూడటానికి వచ్చిన వారిని నిర్వాహకులు దోచుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. కారు పార్కింగ్ మొదలు.. తినే పదార్థాల వరకూ అన్నింటినీ డబుల్ రేట్లకు విక్రయించారు. కృష్టా జిల్లా కంకిపాడు మండలంలో ఓ చోట ఏకంగా కారు పార్కింగ్ ఫీజుకే రూ.200 వసూలు చేశారు. మరోవైపు బరుల దగ్గర మద్యం ఏరులై పారుతోంది. పండగ సీజన్ కావడంతో.. పోలీసులు కూడా చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే టాక్ ఉంది.

కోడి పందేలను చూసేందుకు , పందేలు కాయడానికి ఏపీలోని ఇతర జిల్లాలతో పాటు.. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై నుంచి సినీ నటులు, బడా వ్యాపారులు గోదావరి జిల్లాలకు వస్తున్నారు. కేవలం పండగ రోజుల్లోనే కొన్ని వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయనే టాక్ ఉంది. ఈ ఏడాది.. 12 నుంచి 15 వరకు నాలుగు రోజులు కోడి పందేల నిర్వహించడానికి భారీగా ఏర్పాట్లు చేశారు. గతంలో కొన్ని ప్రాంతాలకే పరిమితం అయిన ఈ కోడి పందేలా కల్చర్.. ఇప్పుడు చాలా జిల్లాలకు పాకింది. ఒకప్పుడు సరదాగా సాగిన కోడి పందేలు.. ఇప్పుడు మంచి బిజినెస్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే చాలామంది కోళ్లను పెంచడం, వాటిని విక్రయించడం, బరులు నిర్వహించడం ద్వారా కోట్లాది రూపాయలు కూడబెడుతున్నారనే అభిప్రాయాలు ఉన్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular