
టీడీపీ కుదేలైంది. వైసీపీ కొట్టిన దెబ్బకు కోలుకోవడం లేదు. మరోవైపు ప్రత్యర్థులంతా కాచుకూర్చున్నారు. బీజేపీ అయితే చంద్రబాబును నిర్వీర్యం చేసి టీడీపీని హైజాక్ చేయాలని చూస్తోంది. ఇప్పటికే నలుగురు రాజ్యసభ ఎంపీలను లాగేసింది. పార్టీ మారిన వారంతా అంతా లోకేష్ చేశాడంటున్నారు. ఇక లోకేష్ పై నమ్మకం లేదని.. జూనియర్ ఎన్టీఆర్ రావాలని కొందరంటున్నారు. ఇక టీడీపీ గడ్డు పరిస్థితుల్లో ఉందని.. బాలక్రిష్ణ సినిమాలు వదిలి ఫుల్ టైం పాలిటిక్స్ లోకి రావాలని తెలుగుతమ్ముళ్లు కోరుతున్నారు.ఈ నేపథ్యంలో లోకేష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?
పాదయాత్ర.. తెలుగునేలపై పవర్ ఫుల్ యాత్ర. రాష్ట్రమంతటా తిరుగుతూ ప్రజల కష్టాలు ప్రత్యక్షంగా చూసే యాత్ర. అందుకే ఈ పాదయాత్ర చేసిన నాయకులను ప్రజలు అందలమెక్కించారు. ఆ తదనంతర కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రులను చేశారు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, వైఎస్ జగన్.. అంతా ఒకేబాటలో నడిచారు. అనంతరం అధికారాన్ని అధిరోహించారు.
ఇప్పుడు జగన్ పాదయాత్రతో కొల్లగొట్టిన అధికారాన్ని అదే అస్త్రంతో టీడీపీని గద్దెనెక్కించాలని మొదలు పెట్టబోతున్నారట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన పార్టీకి జవసత్త్వాలు నింపేందుకు.. తన నాయకత్వంపై వస్తున్న విమర్శలకు జవాబు చెప్పేందుకు.. నాయకత్వ పటిమను నిరూపించుకునేందుకు ఇప్పుడు లోకేష్ ఎంచుకుంటున్న ఆయుధం పాదయాత్రేనన్న చర్చ టీడీపీలో సాగుతోంది…అయితే దాన్ని కొంచెం మార్చి సైకిల్ యాత్ర కు శ్రీకారం చుట్టబోతున్నాడట..
Also Read: టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు అతడేనా?
కనీసం సొంతంగా ఎమ్మెల్యేగా గెలవలేని స్థితిలో లోకేష్ బాబు ఉన్నాడని పోయిన ఎన్నికలతో నిరూపితమైంది.. నాయకత్వ సామర్థ్యాలు మచ్చుకైనా లేని లోకేష్ సైకిల్ యాత్రతో టీడీపీ అధికారంలోకి తెస్తాడా? అన్నది ఇప్పుటు టీడీపీ శ్రేణులనే తొలిచేస్తోంది.. సోషల్ మీడియాలో లోకేష్ అసమర్థతపై పేలిన మీమ్స్, సెటైర్లు అన్నీ ఇన్నీ కావు.. అలాంటి లోకేష్ పాదయాత్ర చేసినా.. సైకిల్ యాత్ర చేసినా తెలుగు జనాల్లో పాపులారిటీ రావడం కష్టమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. తండ్రి చాటు బిడ్డగా ఎదిగిన లోకేష్ ను అసలు టీడీపీ వాళ్లే యాక్సెప్ట్ చేయడం లేదన్న విమర్శ ఉంది… ఇక జనాల సంగతి చెప్పాల్సిన అవసరం లేదంటున్నారు. మరి వైఎస్ఆర్, చంద్రబాబు, జగన్ ల మాదిరిగా లోకేష్ పాదయాత్ర చేసినా సైకిల్ యాత్ర చేసినా నిష్ప్రయోజనం తప్పితే పార్టీకి పెద్దగా లాభం ఉండదన్నది పొలిటికల్ విశ్లేషకుల భావన..