spot_img
Homeజాతీయ వార్తలుLok Sabha Polls: మరో రెండు స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఆ ఇద్దరు ఎవరంటే..

Lok Sabha Polls: మరో రెండు స్థానాలకు బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన.. ఆ ఇద్దరు ఎవరంటే..

Lok Sabha Polls: పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన నేపథ్యంలో తెలంగాణలో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై దృష్టిసారించాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇప్పటికే 15 మంది అభ్యర్థులను ప్రకటించి అందరికంటే ముందు వరుసలో ఉంది. తర్వాత కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ ఉన్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్‌ఎస్‌ పార్లమెంటు ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే 11 మందిని ప్రకటించిన గులాబీ పార్టీ అధినేత కేసీఆర్‌ తాజాగా మరో రెండు స్థానాలకు అబ్యర్థులను ప్రకటించారు.

నాగర్‌ కర్నూల్, మెదక్‌..
తాజాగా ప్రకటించిన రెండు స్థానాలు నాగర్‌కర్నూల్‌(ఎస్సీ), మెదక్‌ పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. నాగర్‌ కర్నూల్‌ నుంచి బీఎస్పీ మాజీ అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్‌ ఆర్‌ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు టికెట్‌ ఇచ్చారు. మెదక్‌ లోక్‌సభ అభ్యర్థిగా మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డిని ప్రనకటించారు. ప్రవీణ్‌కుమార్‌ ఇటీవలే బీఎస్సీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. వెంకట్రామిరెడ్డి మూడేళ్ల క్రితం కలెక్టర్‌గా రిటైర్‌ అయ్యారు. అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

పోటీకి చాలా మంది దూరం..
బీఆర్‌ఎస్‌ నేతలు చాలా మంది ఆ పార్టీ టికెట్‌పై పోటీకి నిరాకరిస్తున్నారు. ఈక్రమంలోనే సిట్టింగ్‌ ఎంపీలు వెంకటేశ్‌నేత, రాములు, బీబీపాటిల్‌ బీజేపీలో చేరారు. ఇక వరంగల్‌ సిట్టింగ్‌ ఎంపీ పసునూరి దయాకర్, చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలోనే క్యాడర్‌ అభిప్రాయం మేరకు అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఇక బీఆర్‌ఎస్‌ టికెట్‌ అడిగేవారు లేకపోవడంతో ఎంపిక చేసిన అభ్యర్థులకు కూడా అసమ్మతి బాధ లేదు.

మొదటి జాబితాలో వీళ్లు
బీఆర్‌ఎస్‌ తొలి జాబితాలో ఖమ్మం నామానాగేశ్వర్‌రావు. మహబూబాబాద్‌ నుంచి మాలోత్‌ కవిత, మహబూబ్‌నగర్‌ నుంచి మన్నె శ్రీనివాస్‌రెడ్డి, కరీంనగర్‌ నుంచి బోయినపల్లి వినోద్‌కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్‌ను ప్రకటించారు. తర్వాత రెండో జాబితాలో చేవెళ్ల నుంచి కాసాని జ్ఞానేశ్వర్‌ ముదిరాజ్, నిజామాబాద్‌ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్‌రెడ్డి, జహీరాబాద్‌ నుంచి గాలి అనిల్‌కుమార్, వరంగల్‌ నుంచి కడియం కావ్యను ప్రకటించారు. తర్వాత మూడో జాబితాలో ఆదిలాబాద్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు, మల్కాజిగిరి నుంచి లక్ష్మారెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్‌ ప్రకటించారు. తాజాగా మెదక్‌ సీటు వెంకట్రామిరెడ్డికి, నాగర్‌కర్నూల్‌ టికెట్‌ ఆర్‌ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌కు ఇచ్చారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Modi Gen Z Video

Modi Gen Z Video: అర్ధరాత్రి సొంతంగా మరో వీడియో.. తనలోని Gen-Zని ఆవిష్కరిస్తున్న మోదీ

Modi Gen Z Video: దేశవాసియో అనే మాట లేదు. బయో బహనో అనే వాక్యం లేదు. భారత్ మాతాకీ జై అనలేదు. జైశ్రీరామ్ అని చెప్పలేదు. జస్ట్ మై ఫ్రెండ్స్ అన్నాడు...
YSRCP Leaders

YSRCP Leaders: కుటుంబ వివాదాలే రాజకీయ కక్షలట!

YSRCP Leaders: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ వ్యక్తిగత వైఖరితో ఇబ్బందులు తెచ్చుకుంటున్నారు. చిన్న వివాదాలను సైతం పెద్దది చేసుకొని పోలీస్ కేసులకు గురవుతున్నారు. అరెస్టుల బారిన పడుతున్నారు. మొన్ననే మాజీమంత్రి...
Megastar Chiranjeevi

Megastar Chiranjeevi: చిరంజీవి కి ఆ ఇద్దరు దర్శకులంటే చాలా ఇష్టం…

Megastar Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న ఏకైక నటుడు మెగాస్టార్ చిరంజీవి...కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఒక మిడిల్ క్లాస్...
Andhra Pradesh Investments

Andhra Pradesh Investments: ఏపీకి భారీ పెట్టుబడులు!

Andhra Pradesh Investments: రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడంపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఉత్తరాంధ్రకు వరుసగా ఐటీ కంపెనీలు వస్తున్నాయి. ఇప్పటికే ప్రపంచ దిగ్గజ గూగుల్, రిలయన్స్ డేటా సెంటర్లు వచ్చాయి....
Modi Instagram Reel

Modi Instagram Reel: మోదీ ఇన్‌స్టా రీల్‌తో ప్రపంచ రికార్డు.. 24 గంటల్లో 30 కోట్లకు పైగా వ్యూస్‌!

Modi Instagram Reel: నీట్‌ పరీక్షా పేపర్‌ లీకేజీలపై కొన్ని రోజులుగా ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద కాక్రోజ్‌ జనతాపార్టీ(సీజేపీ) ఆధ్వర్యంలో ఆదోళన చేస్తోంది. విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ రాజీనామాకు డిమాండ్‌ చేస్తోంది....
Oktelugu Epaper