Homeజాతీయ వార్తలుతెలంగాణ విద్యార్థుల గోడు పట్టని కేటీఆర్ 

తెలంగాణ విద్యార్థుల గోడు పట్టని కేటీఆర్ 

 వాట్స్ యాప్ ద్వారా ఆపదలో ఉన్న వారెవ్వరు   సంప్రదించినా వెంటనే తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఉంటారని  మీడియాలో తరచూ వార్తలు చూస్తుంటాము. ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడే కాక కాబోయే ముఖ్యమంత్రిగా పేరొందారు. తెరవెనుక నిజమైన అధికార కేంద్రంగా  వ్యవహరిస్తున్నారని ప్రతీతి. 

దేశ విదేశాలలో లాక్ డౌన్ కారణంగా చిక్కుకు పోయిన తెలంగాణ వారిని వెనుకకు రప్పించడానికి ఎంతో శ్రమిస్తున్నట్లు నిత్యం మీడియాలో కనిపించే ఆయన ఇతర రాష్ట్రాలలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థుల గురించి ఏమాత్రం పట్టించుకున్నట్లు లేదు. 

పంజాబ్ లోని జలంధర్లో  చిక్కుకు పోయిన సుమారు 400 మంది విద్యార్థులకోసం  కేంద్ర రైల్వే మంత్రి ప్రత్యేక రైలు ఏర్పాటుకు సిద్ధంగాఉండడంతో, తెలంగాణకు వచ్చెందుకు అనుమతింపమని కేటీఆర్ కు, ఇతర ముఖ్య అధికారులకు ఎన్ని వినతులు పంపుతున్నా స్పందనే కనిపించడం లేదు. 

లాక్ డౌన్ కారణంగా పంజాబ్ లోని జలంధర్ లో చిక్కుకు పోయిన సుమారు వేయి మంది తెలుగు విద్యార్థులు ఆర్ ఎస్ ఎస్ చొరవతో ఇంటికి చేరుకొనే మార్గం ఏర్పడింది. ఏపీ ప్రభుత్వం వెంటనే స్పందించడంతో ఆ రాష్ట్రానికి చెందిన 600 మంది విద్యార్థులు బుధవారమే బయలుదేరి, గురువారం సాయంత్రంకు విజయవాడ చేరుకోనున్నారు. 

జలంధర్ లోని లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ లో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన సుమారు 100 మంది ఇంజనీరింగ్ కోర్స్ చదువుతున్నారు. లాక్ డౌన్ కారణంగా మార్చ్ 22 నుండి హాస్టల్స్ మూసివేసి, బయటకు పంపివేయడంతో, రవాణా సదుపాయం లేక వారక్కడ చిక్కుకు పోయారు. వారిలో కొద్దీ మందికి స్థానిక ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు భజన, వసతి ఏర్పాట్లు చేశారు. 

ఈ విషయం తెలుసుకున్న సికింద్రాబాద్ ఆర్ ఎస్ ఎస్ విభాగ్ ప్రచారం ఎం యాదిరెడ్డి వారిని సంప్రదించగా మొత్తం 1000 మంది తెలుగు విద్యార్థులు అక్కడ దిక్కుతోచని స్థితిలో, తల ఒక చోట ఉండిపోయారని తెలుసుకున్నారు.

వెంటనే బిజెపి ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్, తెలంగాణ బిజెపి ఇంచార్జ్ కృష్ణ దాస్ ల ద్వారా కేంద్ర రైల్వే మంత్రిని సంప్రదించారు. వారికోసం ప్రత్యేక రైళ్లు నడపడానికి రైల్వే మంత్రి అంగీకరించారు. 

ఆ తర్వాత సంప్రదించగా ఏపీ ప్రభుత్వం స్పందించి ప్రత్యేక రైలులో వచ్చేవారిని వారి వారి స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతి ఇచ్చింది. దానితో ఒక ప్రత్యేక రైలులో బుధవారం 600 మంది బయలుదేరారు. ఆ రైలులో మరో 60 బెర్త్ లు ఖాళీగా ఉండగా, తెలంగాణకు చెందిన విద్యార్థులు సహితం కొద్దిమంది బయలుదేరారు. వారు వరంగల్ లో దిగుతారు. 

అయితే తెలంగాణ విద్యార్థులు తిరిగి రావడానికి ఎన్ని సార్లు ప్రయత్నించినా తెలంగాణ ప్రభుత్వం నుండి స్పందన రావడం లేదు. ఆ విద్యార్థులు స్వయంగా మంత్రి కె టి ఆర్ కు, ఇతర ప్రముఖులకు  వాట్స్ యాప్ లో ఎన్ని సార్లు వినతులు పంపినా స్పందించడం లేదు. దానితో వారింకా అక్కడే ఉండిపోయారు. 

జలంధర్ లోనే రైలు ఎక్కే సమయంలోనే వైద్యుల బృందం వారికి ఆరోగ్య పరిక్షలు జరిపి, వారికి వైరస్ సోకలేదని నిర్ధారించుకున్న తర్వాతనే రైలులో ఎక్కించారు. రైలులో సహితం భౌతిక దూరం, మాస్క్ లు వంటి జాగ్రత్తలు తీసుకొంటున్నారు. 

అవసరం అనుకొంటూ రైలు దిగే సమయంలో సహితం స్థానిక అధికారులు వారికి మరోసారి ఆరోగ్య పరీక్షలు జరిపించి, వారిని స్వీయ నిర్బంధంలో ఉండేవిధంగా తమ తమ ఇళ్లకు పంపవచ్చని యాదిరెడ్డి తెలిపారు. 

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.
RELATED ARTICLES

Most Popular