Homeఆంధ్రప్రదేశ్‌ముందుకు సాగని ప్రచార ‘పవనాలు’

ముందుకు సాగని ప్రచార ‘పవనాలు’

Pawan
జనసేన నాయకుడు పవన్ కల్యాణ్ మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాలు.. రాజకీయాలకు పెద్దగా తేడా లేదన్నట్లుగా భావిస్తున్నారు. పార్టీ పెట్టింది మొదలు.. అసలు అతడి ఉద్దేశం ఏమిటో తెలియకుండా ముందుకు సాగుతున్నారు. ఏదైన సంఘటన జరిగినప్పుడు మాత్రమే వెలుగులోకి వస్తున్నా పవన్ కల్యాణ్ సినిమాలో డైలాగులు కొట్టినట్లుగా నాలుగు మాటలు మాట్లాడి వెళ్లిపోతున్నారు. ఇలాంటి ఘటనలు అనేకసార్లు జరిగినా.. పెద్దగా స్పందించకపోవడం విశేషం. పంచాయతీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన తరువాత కూడా టీడీపీ మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలని శక్తివంచన లేకుండా కృషి చేస్తోంది.

Also Read: బెజవాడలో తమ్ముళ్ల కుమ్ములాట.. టీడీపీ వర్సెస్‌ టీడీపీ

70ఏళ్ల వయసు దాటినా కూడా చంద్రబాబు నాయుడు అలుపెరగకుండా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. బాబు రాజకీయ అభిప్రాయాలను వ్యతిరేకించేవారు కూడా.. ఆయన ప్రయత్నాలను తప్పు పట్టలేరు. పొలిటికల్ స్పిరిట్ అంటే ఇదీ.. కానీ రాష్రాన్ని సుడిగాలిలా చుట్టేందుకు వయసు.. ఆరోగ్యం సహకరిస్తున్నా.. జనసేనాని వపన్ కల్యాణ్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ.. జనసేన కూటమికి ఓటు వేయాలని ఓ వీడియో సందేశాన్ని విడుదల చేయడం గమనార్హం.

Also Read: జగన్ సీటుకు ఎసరు.. ఎంఐఎం అసదుద్దీన్ సంచలన వ్యాఖ్యలు

దీన్నిబట్టి చూస్తే.. పవన్ కల్యాణ్ రాజకీయాలను ఎంత సులువుగా తీసుకుంటున్నారో అర్థం అవుతుంది. ఇంట్లో కూర్చుని ఊరికే మాటలు చెబితే.. సమాజంలో మార్పు వస్తుందా..? లక్షలాది పుస్తకాలు చదివానని చెప్పుకునే వపన్ కల్యాణ్ కు ఆ మాత్రం తెలియదా..? అనే ప్రశ్నలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో దయచేసి వైసీపీకి ఓటు వేయవద్దు.. వాళ్లు ఇచ్చే నోట్లు ఆశపడి ఓట్లు వేస్తే.. మనల్ని యాచించే స్థాయికి తీసుకెళ్తారని పవన్ కల్యాణ్ ఓ వీడియోను విడుదల చేశారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

పంచాయతీ ఎన్నికల కన్నా.. పదింత బీభత్సాన్ని మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ నాయకులు సృష్టించారు. వీరిధాటికి కాకలు తీరిన రాజకీయ పార్టీలే కొట్టుకుపోయాయి. జనసేన అభ్యర్థులను బెదిరించినా.. వారి దాష్టికాలను ఎదురొడ్డే శక్తి మాకు ఉంది. ఆ యవబలమూ ఎన్నికల్లో ధైర్యంగా నిలబెట్టిందని పవన్ పేర్కొన్నారు. ఒకవైపు ఇదే వీడియోలో అధికార పార్టీ నేతలు తిరగబడుతున్నారని ఆరోపించారు. అలాంటప్పుడు సమాన్యుడికి భరోసా కల్పించాలంటే వీడియో సందేశాలు సరిపోతాయా..? నేరుగా బాధితుల వద్దకు వెళ్లి భరోసా నింపే ఓపిక పవన్ కు లేదా..? ఇదేనా సమాజంలో మార్పు తీసుకొచ్చే విధానం… ఇప్పటికైనా.. ఒట్టిమాటలు కట్టిపెట్టి.. గట్టిమేలు తలపెట్టే చర్యలు పవన్ కల్యాణ్ శ్రీకారం చుట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular