జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పుడు బీజేపీతో మిత్రపక్షంగా కొనసాగుతున్నారు. దీంతో ఆయన ఉక్కు పరిశ్రమ ఉద్యమంలో పెద్దగా పాలు పంచుకోవడం లేదు. ఎందుకంటే ఉక్కు పరిశ్రమను రద్దు చేసింది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం. దీంతో ఆయన అటు కేంద్రాన్ని విమర్శించలేక.. ఇటు రాష్ట్ర ఉక్కు ఉద్యమంలో పాల్గొనలేక పోతున్నారు. ముఖ్యంగా పవన్ మాత్రం ఉక్కు ఉద్యమంలోకి ప్రత్యక్షంగా రావాలన్న డిమాండ్ మాత్రం వినిపిస్తోంది. అది రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
Also Read: గెలిపిస్తే తిరుపతికి కేంద్ర మంత్రి పదవి.. బీజేపీ కొత్త స్లోగన్
అందులోనూ.. ముఖ్యంగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు పదే పదే పవన్ కల్యాణ్ ప్రస్తావన తీసుకొస్తున్నారు. మొదట్లో పవన్ వచ్చి గంట సేపు ఉద్యమ శిబిరంలో ఉండాలని చెబుతూ వచ్చిన ఆయన ఇప్పుడు.. నేరుగా ప్రత్యక్షంగా పోరాటంలోకి రావాల్సిన అవసరం ఉందని అంటున్నారు. పవన్ కల్యాణ్ను ప్రత్యేకంగా గంటా టార్గెట్ చేశారన్న అభిప్రాయం వినిపిస్తున్నప్పటికీ.. ఉద్యమం దృష్టితోనే గంటా ఈ వ్యాఖ్యలు.. డిమాండ్లు చేస్తున్నట్లుగా కొందరు అంచనా వేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి ప్రజల నుంచి సంపూర్ణ మద్దతు ఉంది. కానీ.. ఉద్యమాన్ని నడిపించేందుకు మాత్రం సరైన లీడర్ కనిపించడం లేదు. అందుకే ఇప్పటికీ ఆ ఉద్యమం కార్మికుల ఉద్యమంగానే నడుస్తోంది.
Also Read: మున్సిపల్ ఫలితాల్లో వైసీపీ ప్రభజనం.. 15 మున్సిపాల్టీలు కైవసం.. బోణి కొట్టని టీడీపీ
అయితే… పవన్ కల్యాణ్ లాంటి జనాకర్షణ ఉన్న నేత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరకు వ్యతిరేకంగా రోడ్లెక్కితే.. ప్రజలు ఆయన వెంట కదులుతారు. అది మహోద్యమం అవడానికి అవకాశం ఉంటుంది. ప్రణాళిక ప్రకారం.. ఉద్యమానికి పవన్ కల్యాణ్ నాయకత్వం వహిస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గక తప్పదన్న అంచనాలు కొంత మంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లో పండిపోయిన గంటా శ్రీనివాసరావుకు ఈ విషయం తెలుసు కాబట్టే పవన్ను రోడ్డెక్కాలని ఆయన కోరుతున్నారు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఇదిలా ఉంటే.. గంటా శ్రీనివాస్ పిలుపును రాజకీయ వ్యూహంగా కూడా కొంత మంది కొట్టి పారేస్తున్నారు. బీజేపీ నుంచి పవన్ కల్యాణ్ను దూరం చేసే లక్ష్యంతోనే గంటా శ్రీనివాస్.. పవన్ను ఉద్యమంలో ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని కొంత మంది ఆరోపిస్తున్నారు. ఒక వేళ నిజంగా పవన్ కల్యాణ్ స్టీల్ ప్లాంట్ ఉద్యమంలోకి రావాల్సి వస్తే.. ఖచ్చితంగా బీజేపీతో తెగతెంపులు చేసుకోవాల్సి వస్తుంది. లేకపోతే.. పొత్తు పొసగదు. బీజేపీ వంద శాతం.. ప్రైవేటీకరణకే మద్దతునిస్తోంది. ఆ పార్టీ ఏపీ నేతలు కూడా మెల్లగా స్వరాన్ని మార్చుకుంటున్నారు. ప్లాంట్ అక్కడే ఉంటుందని.. ఎక్కడికీ పోదంటూ డొంక తిరుగుడు వాదనలే వినిపిస్తున్నారు. అయితే.. బీజేపీని వదిలించుకోవడానికి జనసేనకు ఇంత కన్నా మంచి మార్గం కూడా దొరకదని మరికొంత మంది విశ్లేషిస్తున్నారు. ఏపీకి ఎలాంటి ప్రయోజనమూ చేకూర్చకుండా.. హామీలు అమలు చేయని బీజేపీపై ప్రజల్లో పీకల్లోతు కోపం ఉందని.. బీజేపీతో అంట కాగడం వల్ల అది జనసేనపై వ్యతిరేకతగా మారే ప్రమాదం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అందుకే.. పవన్ కల్యాణ్ వీలైనంత త్వరగా స్పందించి బీజేపీకి కటీఫ్ చెప్తేస్తేనే ఫ్యూచర్ ఉంటుందని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Ganta srinivas new plan on pawan kalyan
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com