Homeజాతీయ వార్తలుPraja Palana: ప్రజాపాలనలో దరఖాస్తు మిస్‌ అయ్యారా.. అయితే ఇలా చేయండి!

Praja Palana: ప్రజాపాలనలో దరఖాస్తు మిస్‌ అయ్యారా.. అయితే ఇలా చేయండి!

Praja Palana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చింది. మేనిఫెస్టోలో ప్రకటించింది. వంద రోజుల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, రూ.500లకే సిలిండర్, పింఛన్ల పెంపు హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోపే ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించింది. ఇప్పుడు మరో ఐదు హామీల అమలుకు శ్రీకారం చుట్టింది. డిసెంబర్‌ 28 నుంచి జనవరి ఆరు వరకు ప్రజాపాలన పేరుతో ఊరూరా సభలు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించింది. శనివారంతో దరఖాస్తు గడువు ముగిసింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలనకు 1.25 కోట్ల దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు ప్రకటించారు.

1.25 కోట్ల దరఖాస్తులు..
అయితే భారీగా పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్ల కోసమే దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కోటి దరఖాస్తులు అభయ హస్తానికి రాగా, మరో 25 లక్షలు ఇతర అంశాలపై దరఖాస్తులు వచ్చాయని నిర్ధారించారు. ఇన్ని దరఖాస్తులు వచ్చినా.. ఇంకా చాలా మంది వివిధ కారణాలతో దరఖాస్తు చేసుకోలేకపోయారు. గడువు ముగియడంతో ఇప్పుడు ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతున్నారు.

దరఖాస్తు చేసుకోలేనివారు..
ప్రజాపాలన కార్యక్రమాన్ని నాలుగు నెలలకోసారి నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించిది. ఈవిషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రకటించారు. ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపారు. దరఖాస్తులు ఎవరైనా చేయవచ్చని పేర్కొన్నారు. అదే సమయంలో ఈసారి దరఖాస్తు చేసుకోలేని వారు నాలుగు నెలల తర్వాత నిర్వహించే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు దరఖాస్తు చేసుకోలేదని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు అంటున్నారు. ఏప్రిల్‌లో నిర్వహించే రెండో విడత ప్రజాపాలనలో ఈసారి దరఖాస్తు చేసుకోని వారు చేసుకోవచ్చని సూచిస్తున్నారు.

రేషన్‌ కార్డు తప్పనిసరి..
ఇదిలా ఉండగా, అని పథకాలకు రేషన్‌కార్డు తప్పనిసరని ప్రభుత్వం చెబుతోంది. రేషన కార్డు ఉన్నవారికే పథకాలు వర్తిస్తాయని సీఎం సైతం ప్రకటించారు. అయితే రేషన్‌ కార్డు లేనివారు కూడా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. రేషన్‌ కార్డుకు కూడా ప్రజాపాలనలో దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించారు. దీంతో గడిచిన 8 రోజుల్లో రేషన్‌ కార్డు కోసం కూడా భారీగా అర్జీలు వచ్చాయి. రేషన్‌ కార్డు తప్పని సరి నిబంధన నేపథ్యంలో అది లేనివారు ఈసారి ఆయా పథకాలకు అనర్హులయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈసారి రేషన్‌కార్డు జారీ చేస్తే.. రెండో విడత ప్రజాపాలనతో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుందని సమాచారం.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular