Instagram Controversy: నాయకులపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర విమర్శలు సాధారణం అయినప్పటికీ, రుచికా సింగ్ అనే 30 ఏళ్ల మహిళ ప్రధాని మోదీపై చేసిన ఒక్క రీల్ ఇప్పుడు సంచలనంగా మారింది. చేసిన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పినా.. మోదీ తాను క్షమించానని ప్రకటించినా.. ఆ పొరపాటు రుచికా సింగ్ను వెంటాడుతూనే ఉంది. ప్రముఖులతో పోల్చి అనుచిత, అసభ్య పదజాలం ఉపయోగించి ప్రసారం చేసిన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మూసుకోవాల్సి వచ్చింది. చివరకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. కుటుంబ సభ్యులు కూడా సమాజంలో ఉండే పరిస్థితి తేలుద.
మోదీపై తీవ్ర వ్యాఖ్యలు..
రుచికా సింగ్ చేసిన వ్యాఖ్యలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా అవమానాత్మక శైలిలో ఉన్నాయి. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో మోదీకి లింకు పెట్టి మాట్లాడింది. దానిని సోషల్ మీడియాలో పోస్టు చేసింది. పోస్ట్ వైరలవడంతోనే సింగ్ స్వయంగా ఇన్స్టాగ్రామ్ ఆపేసి, అజ్ఞాతంలోకి పోయింది. ఆమె తల్లిదండ్రులు కూడా మానసిక ఒత్తిడిని కారణంగా నగరం విడిచి వెళ్లారు.
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..
రుచికా సింగ్ వ్యాఖ్యలపై ఇప్పుడు నోయిడా పోలీస్స్టేషన్లో ఓ మహిళ ఫిర్యాదు చేసింది. మహిళలు తనపైచేసిన వ్యాఖ్యలను పట్టించుకోవడం లేదని, క్షమించానని మోదీ స్వయంగా వీడియో విడుదల చేశారు. కానీ ఫిర్యాదులపై ఎఫ్ఐఆర్ పోలీసులు నమోదు చేస్తున్నారు. నోయిడా పోలీసులు రుచికా సింగ్ కోసం గాలిస్తున్నారు.
చదువుకున్న యువత నేతలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. రాజకీయ నాయకులపై అసభ్యగా వ్యాఖ్యానించడం చట్టపరంగా ఆరోజింపబడవచ్చు, కానీ సామాజిక పరిణామాలు మాత్రం వ్యక్తిగత హానికరమైన రీతిలో ఉంటాయి. రుచికా సింగ్ ఒక్క రీల్ ఇప్పుడు ఆమె అజ్ఞాతంలోకి వెళ్లేలా చేసింది. సోషల్ మీడియా ఎంత మేలు చేస్తుందో అంతే ప్రమాదకరం కూడా. ఈ విషయాన్ని యువత గుర్తించాలి.