Homeఅంతర్జాతీయంIndia Defence: చైనా, పాకిస్తాన్‌ తెరవెనుక కుట్రలు.. భారత అప్రమత్తం!

India Defence: చైనా, పాకిస్తాన్‌ తెరవెనుక కుట్రలు.. భారత అప్రమత్తం!

India Defence: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మన సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. ఇదే సమయంలో మనకు మిత్రుడు ఎవరు, శత్రువు ఎవరు అన్నది తేలిపోయింది. ఈ క్రమంలో భారత్‌ మరింత శక్తివంతమైన సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. రక్షణ బడ్జెట్‌ భారీగా పెంచింది. ప్రస్తుతం స్వదేశీ ఆయుధ తయారీపై దృష్టి సారిస్తూ విదేశీ దిగుమతులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇది దీర్ఘకాలికంగా సరైన మార్గమే అయినా, సమీప భవిష్యత్తులో ఎదురవుతున్న సవాళ్లు తీవ్రమైనవి. యుద్ధ […]

India Defence: ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత మన సైనిక శక్తి ప్రపంచానికి తెలిసింది. ఇదే సమయంలో మనకు మిత్రుడు ఎవరు, శత్రువు ఎవరు అన్నది తేలిపోయింది. ఈ క్రమంలో భారత్‌ మరింత శక్తివంతమైన సొంత ఆయుధాల తయారీపై దృష్టి పెట్టింది. రక్షణ బడ్జెట్‌ భారీగా పెంచింది. ప్రస్తుతం స్వదేశీ ఆయుధ తయారీపై దృష్టి సారిస్తూ విదేశీ దిగుమతులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. ఇది దీర్ఘకాలికంగా సరైన మార్గమే అయినా, సమీప భవిష్యత్తులో ఎదురవుతున్న సవాళ్లు తీవ్రమైనవి. యుద్ధ విమానాల కొరత, సేనా అవసరాలు తీర్చలేని స్థానిక సామర్థ్యం, పాకిస్తాన్‌–చైనా వైపు నుంచి పెరుగుతున్న ముప్పులు ఆందోళన కలిగిస్తున్నాయి.

యుద్ధ విమానాల కొరత..
మిగ్‌ విమానాలను నిలిపివేసిన తర్వాత భారత వైమానిక దళం దాదాపు 150 కొత్త యుద్ధ విమానాల అవసరాన్ని ఎదుర్కొంటోంది. ఇప్పటి నుంచి సమీకరణ ప్రక్రియ ప్రారంభించినా ఐదారేళ్లు పట్టే అవకాశం ఉంది. సమస్య ఇంకా లోతుగా ఉంది. సైన్యం నిర్దేశించిన ప్యారామీటర్లకు అనుగుణంగా విమానాలు తయారు చేసే సామర్థ్యం దేశంలో ఇంకా పూర్తిగా లేదు. అమెరికా, రష్యా విమానాలను సైన్యం తిరస్కరిస్తోంది. ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ విమానాలు వస్తున్నా ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా వైమానిక శక్తిలో తాత్కాలికంగా లోపం ఏర్పడుతోంది. యుద్ధ నౌకల విషయంలో స్వదేశీ తయారీ మెరుగుపడుతున్నా, మొత్తం ఆయుధ సంఖ్య గతంతో పోలిస్తే తగ్గినట్లు కనిపిస్తోంది. ఇది ప్రస్తుత భద్రతా పరిస్థితిలో ఆందోళన కలిగించే అంశం.

పాకిస్తాన్‌ వైపు నుంచి పొంచిఉన్న ప్రమాదం
ఈ సమయంలో పాకిస్తాన్‌ భారత్‌పై దాడి ప్రయత్నాలకు సన్నాహాలు చేస్తున్నట్లు సూచనలు ఉన్నాయి. చైనా, టర్కీ నుంచి ఆయుధాలు దిగుమతి చేసుకోవడం దీనిలో భాగమే అని నిపుణులు అంటున్నారు. అంతకంటే ముఖ్యమైనది పాకిస్తాన్‌ పార్లమెంట్‌ అణ్వస్త్రాల నియంత్రణను సైన్యాధిపతి ఆసిమ్‌ మునీర్‌కు అప్పగించే తీర్మానం చేసింది. ఇది నిర్ణయాలు తీసుకునే ప్రక్రియను మరింత కేంద్రీకృతం చేసి, అనూహ్య చర్యలకు దారితీసే అవకాశాన్ని పెంచుతోంది. భారత్‌ను దెబ్బతీసే ప్రయత్నం గట్టిగా జరుగుతోందనే అంచనాకు ఇది బలం చేకూరుస్తోంది.

చైనాలో కార్యకలాపాలు..
చైనా వైపు నుంచి కూడా ఆందోళనకరమైన సంకేతాలు వస్తున్నాయి. భారీ ఆయుధ ప్రయోగాలు, సరిహద్దు ప్రాంతాల్లో మోహరింపులు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌ 15 నుంచి లాక్‌డౌన్‌ వంటి చర్యలు, మినిస్టీరియల్‌ స్థాయి తనిఖీలు, దేశం వదలవద్దని, విదేశాల్లో ఉన్నవారు తిరిగి రావాలని ఇచ్చిన ఆదేశాలు ఇవన్నీ సాధారణ పరిస్థితికి భిన్నంగా ఉన్నాయి. ఇవి అనుమానాలకు తావిస్తున్నాయి. రెండు వైపుల నుంచి ఒకేసారి ఒత్తిడి ఏర్పడే అవకాశాన్ని పూర్తిగా కొట్టిపారేయలేం.

భారత్‌ అలర్ట్‌..
స్వదేశీ ఉత్పత్తి పెంపు అనేది అవసరమైన వ్యూహం. కానీ ప్రస్తుత అవసరాలను తీర్చడానికి వెంటనే చర్యలు అవసరం. విమానాల సమీకరణలో వేగం పెంచడం, సైన్యం అవసరాలకు అనుగుణంగా స్థానిక సామర్థ్యాన్ని వేగంగా పెంచడం, అదే సమయంలో అవసరమైతే నమ్మకమైన మిత్రదేశాల నుంచి తాత్కాలిక సరఫరాలు సాధించడం ముఖ్యం. పాకిస్తాన్, చైనా వైపు నుంచి వస్తున్న సంకేతాలను సాధారణంగా చూడకుండా సమగ్ర సన్నద్ధత పెంచుకోవాలి.

భారత్‌ గతంలో కఠిన పరిస్థితులను ఎదుర్కొని బయటపడింది. ప్రస్తుత లోపాలను గుర్తించి వేగంగా సరిచేసుకుంటేనే రాబోయే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోగలుగుతుంది. రక్షణ రంగంలో ఆలస్యం అనేది ఖరీదైనది కావచ్చు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper