Chandrababu, Modi
విశాఖ ఘటనపై దర్యాప్తు విషయంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు అధినేత చంద్రబాబు ప్రధాని మోడీకి లేఖ రాశారు. ఇటీవల కరోనా అంశంపై కూడా ఆయన ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖపై వైసీపీ నాయకులు పెదవి విరిచారు. అవేమీ పట్టించుకోని చంద్రబాబు ఇటీవల చోటు చేసుకున్న విశాఖ ఎల్.జి ఘటనపై ప్రధానికి రాసిన లేఖలో కొన్ని సూచనలు చేశారు.
ఎల్.జి పాలిమర్స్ వద్ద తీవ్ర ఉద్రిక్తత..!
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయించాలని ప్రధాని నరేంద్ర మోడీని కోరారు. ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చిందన్నారు. దుర్ఘటనపై మీ సత్వర స్పందనను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని చెప్పారు. సత్వరమే మీరు స్పందించి చేపట్టిన చర్యలు విశ్వాసాన్నిచ్చాయని పేర్కొన్నారు. గ్యాస్ లీకేజీపై విచారణకు సైంటిఫిక్ కమిటీని ఏర్పాటు చేయాలని కోరారు. విష వాయువు విడుదలకు దారితీసిన అంశాలపై దర్యాప్తు చేయించాలన్నారు. లీకైన వాయువు స్టైరీన్ అని కంపెనీ చెబుతుందని, అయితే స్టైరీన్తోపాటు మరికొన్ని వాయువులు ఉన్నాయని భిన్న నివేదికలు ఉన్నాయని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.