టెస్ట్ సిరీస్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడుతున్న భారత్ ప్రస్తుతం బ్యాటింగ్ చేస్తోంది. మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా తాజాగా వికెట్ కోల్పోయింది. బరిలోకి దిగిన బుమ్రా 2 పరుగులు చేసి రెండో ఓవర్లోనే ఔటయ్యాడు. దీంతో 15 పరుగుల వద్ద భారత్ ఒక వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియాతో మొదటి ఇన్నింగ్స్ లో భారత్ 244 పరుగులు చేసి ఆల్ ఔట్ అయింది. ఆసీస్ 191 పరుగులకు మొత్తం వికెట్లు కొల్పోయింది. దీంతో ఆసీస్ పై భారత్ 53 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. శుక్రవారం సాయంత్రమే రెండో ఇన్నింగ్ ప్రారంభించినా తాజాగా ఓ వికెట్ కోల్పోయింది.