
తాను బీజేపీలో చేరుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని అంటున్నాడు ప్రముఖ తమిళ సినీ నటుడు విశాల్. విశాల్ గతంలో నడిగర్ సంఘం, సినీ నిర్మాతల సంఘం ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాలని అనుకున్నారు.
మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత ఖాళీపడిన ఆర్కేనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్గా పోటీ చేసేందుకు నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఆఖరి క్షణంలో ఆ నామినేషన్ను ప్రతిపాదించిన వారిలో కొందరు తమ పేర్లను ఉపసంహరించుకోవడంతో విశాల్ నామినేషన్ను ఎన్నికల అధికారులు తోసిపుచ్చారు.
తాజాగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు పార్టీలు సిద్ధపడుతున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీల్లోనూ కొంత సినీ గ్లామర్ కనిపించాలని తాపత్రయపడుతున్నాయి. దీంతో సినీ నటీనటులను చేర్చుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇందులో భాగంగానే విశాల్ కూడా బీజేపీ గూటికి చేరుతున్నారని వార్తలు వచ్చాయి. అంతేకాదు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మురుగన్ను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగారని వినిపించింది. దీంతో స్పందించిన విశాల్ ఓ తమిళ టీవీ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాటన్నింటినీ కొట్టిపారేశారు. తాను బీజేపీలో చేరే ప్రసక్తే లేదని అంటున్నారు.
Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?