Pawan Kalyan Varahi Yatra
Pawan Kalyan Varahi Yatra: జనసేనాని పవన్ కళ్యాణ్ విశాఖ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఆయన భీమిలి నియోజకవర్గంలో ఎర్రమట్టి దిబ్బలను సందర్శించారు. పవన్ కళ్యాణ్ నడుచుకుంటూ వెళుతుంటే జనసేన శ్రేణులు ఆయన్ని అనుసరించాయి. ఎర్ర మట్టి దిబ్బలలో పవన్ కళ్యాణ్ చెప్పులు లేకుండా నడిచారు. విపరీతమైన దుమ్ము లేస్తుండగా మాస్క్ ధరించారు. అయితే అరుదైన ఎర్ర మట్టిలో ఆయన ఒట్టి పాదాలతో నడిచి అనుభూతి పొందారు. తన చెప్పులను స్వయంగా చేతుల్లో పట్టుకుని సంచరించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ కాళ్లకు చెప్పులు లేకుండా నడవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్యాన్స్ ఆయన నిజమైన నాయకుడని కొనియాడుతున్నారు.కొందరు అత్తారింటి దారేది మూవీలో సీన్ రిపీట్ అయ్యిందని కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది భారీ బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇండస్ట్రీ రికార్డ్స్ తిరగరాసింది.
ఈ మూవీలో ఆరడుగుల బుల్లెట్ సాంగ్ సినిమాకు హైలెట్ అని చెప్పాలి. విదేశాల నుండి అత్తయ్య కోసం పవన్ ఇండియా వచ్చే క్రమంలో ఈ సాంగ్ వస్తుంది. ఆరడుగుల బుల్లెట్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ షూస్ లేకుండా నడుస్తారు. ఆయన షూస్ ని పక్కన ఉన్న అసిస్టెంట్ పట్టుకోగా… పవన్ కళ్యాణ్ సూటు బూటులో ఒట్టి కాళ్లతో నడుస్తారు. ఈ సన్నివేశాన్ని విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ గుర్తు చేశారని అంటున్నారు.
ఇటీవల బ్రో మూవీతో అలరించిన పవన్ కళ్యాణ్ నెక్స్ట్ రెండు చిత్రాలు సిద్ధం చేస్తున్నారు. ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఎన్నికలకు ముందే విడుదల కావచ్చని అంటున్నారు. దర్శకుడు సుజీత్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా ఓజీ తెరకెక్కిస్తున్నారు. అలాగే దర్శకుడు హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు కొంత మేర షూటింగ్ జరుపుకున్నాయి. హరి హర వీరమల్లు చిత్రీకరణ కూడా పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది.
#PawanKalyan walks with bare foot.
Leader for a reason! pic.twitter.com/iy23zZKG3m
— Manobala Vijayabalan (@ManobalaV) August 16, 2023