Animal: యానిమల్ మూవీతో సందీప్ రెడ్డి బ్రదర్స్ భారీగా లాభ పడ్డారనే వాదన ఉంది. యానిమల్ చిత్రాన్ని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మించారు. సందీప్ రెడ్డి వంగ బ్రదర్ ప్రణయ్ రెడ్డి నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. యానిమల్ మూవీని రూ. 200 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. రూ. 800 కోట్లకు పైగా వసూళ్లు దక్కాయి. ఈ సినిమా రూ. 350 కోట్లకు పైగా లాభాలు ఆర్జించిందని ఒక అంచనా. ఇక వంగ బ్రదర్స్ రూ. 100 నుండి 150 కోట్ల వరకు యానిమల్ మూవీతో ఆర్జించారని కథనాలు వెలువడ్డాయి.
ప్రణయ్ రెడ్డి అమెరికాలో జాబ్ చేసుకునేవాడు. సందీప్ రెడ్డి అక్కడ నుండి పిలిపించి నిర్మాణ బాధ్యలు అప్పగించాడు. అర్జున్ రెడ్డి సినిమాను కూడా ప్రణయ్ రెడ్డి నిర్మించారు. యానిమల్ తో వంగ బ్రదర్స్ కి లైఫ్ టైం సెటిల్మెంట్ అయ్యిందని భావిస్తున్న తరుణంలో… ప్రణయ్ రెడ్డి కామెంట్స్ ఆసక్తి రేపాయి.
కొన్ని కారణాల వలన యానిమల్ మూవీ భారీగా వసూళ్లు కోల్పోయిందని ఆయన అన్నారు. థియేటర్స్ లభించక మొదటి వారం రూ. 40 కోట్ల వసూళ్లు నష్టపోవాల్సి వచ్చింది. సినిమాకు ఏ సర్టిఫికెట్ ఇవ్వడం, నిడివి 3:21 నిమిషాలు కావడం, సామ్ బహుదూర్ విడుదల కారణంగా కలెక్షన్స్ కోల్పోవాల్సి వచ్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
లేదంటే యానిమల్ వెయ్యి కోట్ల మార్క్ ఈజీగా దాటిందని పరోక్షంగా చెప్పాడు. ఓటీటీలో యానిమల్ విడుదల కానుంది. ఓటీటీ వెర్షన్ లో కొత్త సీన్స్ యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారని ప్రచారం జరుగుతుంది. దీనిపై స్పందించిన ప్రణయ్ రెడ్డి… కొత్త సన్నివేశాలు యాడ్ చేయాలా వద్దా? అనే ఆలోచనలో ఉన్నాము. కొత్త సీన్స్ జోడించిన నేపథ్యంలో మరలా సెన్సార్ కి వెళ్లాలని ఆయన చెప్పారు. రన్బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ చిత్రానికి యానిమల్ పార్క్ సీక్వెల్ గా ప్రకటించారు.