మెగా పవర్ స్టార్ ‘రామ్ చరణ్’ సన్నిహితుడు కుడోస్ కి ఒక గ్రీన్ కో సంస్థ ఉంది. అయితే, చరణ్ స్నేహితుడు తన గ్రీన్ కో సంస్థ తరుపున తెలంగాణ ప్రభుత్వానికి 1000 ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను విరాళంగా అందించి మొత్తానికి భారీ సాయం చేశాడు. స్నేహితుడి సేవకు పొంగిపోయిన చరణ్ అతని పై సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రశంసల వర్షం కురుపించాడు.
రామ్ చరణ్ ట్విటర్ వేదికగా పోస్ట్ చేస్తూ ‘ప్రభుత్వానికి 1000కి పైగా ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందిస్తున్న నా ఫ్రెండ్ కుడోస్ సంస్థ గ్రీన్కో గ్రూపునకు శుభాకాంక్షలు. కరోనా మహమ్మారి మన పై పెను సవాల్ విసురుతున్న ఇలాంటి అతి కష్ట కాలంలో దేశంలోని ప్రభుత్వాసుపత్రులకు సిలిండర్లు, కాన్సంట్రేటర్లు అందించడం అనేది గొప్ప సాయం’ అంటూ రామ్ చరణ్ ట్వీట్ చేశారు.
ఇక ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకు చేసే విలయతాండవం దెబ్బకు జనం పిట్టల్లా రాలిపోతున్నారు. మరోపక్క పాజిటివ్ కేసుల సంఖ్య లక్షల్లో నమోదవుతున్నాయి. కానీ హాస్పిటల్స్ లో బెడ్స్ మాత్రం వేల సంఖ్యలో కూడా లేకపోవడం బాధాకరమైన విషయం. సరైన వైద్యం లేక వేలల్లో మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఒక రకమైన భయం వ్యాపించింది.
కరోనా వచ్చి చాలామంది సమయానికి ఆక్సిజన్ అందక చనిపోతున్నారని ప్రభుత్వానికి ఎంతమంది మొర పెట్టుకుంటున్నా, అధికారులు మాత్రం సైలెంట్ గా చూస్తున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పలువురు ప్రముఖలు తమ వంతుగా సాయం చేయడానికి ముందుకు వస్తోన్నా.. నిజంగా సాయం కావాల్సిన వారికీ సాయం అందడం లేదు. కోవిడ్ బాధితులుగా చనిపోతున్నవారిలో ఎక్క\
ytyyi