spot_img
Homeఎంటర్టైన్మెంట్Pushpa 2 : 'పుష్ప 2: ది రూల్ ' 2 వారాల వరల్డ్ వైడ్...

Pushpa 2 : ‘పుష్ప 2: ది రూల్ ‘ 2 వారాల వరల్డ్ వైడ్ వసూళ్లు..హిందీ లో తప్ప ఎక్కడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదా?

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప 2’ చిత్రం విడుదలై నిన్నటితో రెండు వారాలు పూర్తి అయ్యింది. ఈ రెండు వారాలు ఈ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ వండర్స్ ని చరిత్ర ఎప్పటికీ మర్చిపోలేదు. మొదటి రోజు నుండి నిన్నటి వరకు 30 కోట్ల రూపాయిల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూళ్లకు తగ్గకుండా ఈ చిత్రం దూసుకుపోయిందంటే, ఏ రేంజ్ బ్లాక్ బస్టర్ అనేది అర్థం చేసుకోవచ్చు. వీకెండ్ తర్వాత థియేట్రికల్ రన్ అతి కష్టం అన్నట్టుగా ఉంటున్న ఈ ఓటీటీ యుగం లో ఒక సినిమా థియేటర్స్ నుండి ఈ స్థాయి వసూళ్లు రాబట్టడం అనేది ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కి గోల్డెన్ డేస్ అని చెప్పొచ్చు. అయితే ఈ సినిమాకి హిందీ వెర్షన్ లో వస్తున్న వసూళ్లతో పోల్చి చూస్తే మిగిలిన వెర్షన్స్ లో వస్తున్న వసూళ్లు చాలా తక్కువ.

తెలుగు వెర్షన్ లో సూపర్ హిట్ రేంజ్ వసూళ్లు అయితే వచ్చాయి కానీ, ఇప్పటి వరకు బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేదు. విడుదలకు ముందు ఈ సినిమాకి ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ తెలుగు రాష్ట్రాలకు 213 కోట్ల రూపాయలకు జరిగింది. నిన్నటి వరకు ఈ చిత్రానికి 197 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకొని క్లీన్ సూపర్ హిట్ స్టేటస్ కి చేరాలంటే మరో 16 కోట్ల రూపాయిల షేర్ ని రాబట్టాలి. ప్రాంతాల వారీగా కూడా ఈ సినిమాకి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఒక్క ప్రాంతంలో కూడా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. ఈ క్రిస్మస్ కి బ్రేక్ మార్కుని అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక మిగిలిన రాష్ట్రాల విషయానికి వస్తే కర్ణాటక లో ఈ చిత్రానికి 32 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగితే రెండు వారాలకు 47 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఇక్కడ బయ్యర్స్ కి 15 కోట్లు లాభం.

అదే విధంగా తమిళనాడు ప్రాంతం వసూళ్లను ఒకసారి పరిశీలిస్తే ఈ ప్రాంతంలో ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 52 కోట్ల రూపాయలకు జరిగితే, ఇప్పటి వరకు 31 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఈ ప్రాంతం లో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం. కేరళలో అల్లు అర్జున్ కి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రాంతం లో 20 కోట్ల రూపాయలకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే ఇప్పటి వరకు 7 కోట్ల రూపాయిలు మాత్రమే వచ్చింది. ఇక్కడ కూడా బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోవడం అసాధ్యం. నార్త్ ఇండియా లో మాత్రం ఈ సినిమా బయ్యర్స్ కి లాభాల వర్షం కురిపించింది. 200 కోట్ల రూపాయలకు కొంటే, 300 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే వంద కోట్లు లాభం అన్నమాట. ఓవరాల్ గా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ లెక్కలు చూస్తే రెండు వారాలకు కలిపి 1400 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్, 680 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Rhiya Ahir

Rhiya Ahir: 27 ఏళ్ల యువతి సాహసం.. ఒంటరిగా పోలీసు వ్యాన్‌ను అడ్డుకుని విద్యార్థులను విడిపించిన రియా అహిర్....

Rhiya Ahir: నేషనల్ స్థాయి పోటీ పరీక్షల్లో, ముఖ్యంగా నీట్ పేపర్ లీక్ వంటి సమస్యలపై ఢిల్లీలో మొదలైన విద్యార్థుల నిరసనలు ఇప్పుడు దేశవ్యాప్తంగా వ్యాపిస్తున్నాయి. విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా...
Nile River History

Nile River History: వేల ఏళ్ల నాగరికత.. మూడు దేశాల మధ్య యుద్ధానికి కారణమైన నది!

Nile River History: నైలు నది కేవలం ఒక జలప్రవాహం కాదు. ఇది వేల సంవత్సరాలుగా ఒక మహా నాగరికతను పోషించిన, ఆకారం ఇచ్చిన, ఇప్పటికీ కోట్లాది మంది జీవనాధారంగా నిలిచిన ప్రకృతి...
Flying Humans

Flying Humans: పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు వస్తే..

Flying Humans: అప్పుడప్పుడు మనుషులు తమ ఊహలకు రెక్కలు తొడుగుతూ ఉంటారు. వాటిని ఏదో ఒక రూపంలో చూసుకుంటూ మురిసిపోతారు. కాకపోతే పక్షుల మాదిరిగా మనుషులకు రెక్కలు ఉండవు. ఎందుకంటే మన శరీర...
SS Rajamouli

SS Rajamouli: రాజమౌళి ఘోస్ట్ డైరెక్టర్ గా చేసిన మూవీ ప్లాప్ అయిందా…

SS Rajamouli: దర్శక ధీరుడు రాజమౌళి చేసిన ప్రతి సినిమా అతన్ని టాప్ లెవెల్లో నిల్చోబెట్టింది. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు తక్కువే అయినప్పటికి చేసిన అన్ని సినిమాలతో సక్సెస్ లను సాధించిన...
TTD

TTD: భక్తులకు టీటీడీ శుభవార్త.. ఇక తిరుమల భక్తుల కష్టాలు తీరినట్టే

TTD: కలియుగ వైకుంఠనాథుడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం మంచి వార్త అందించింది. పెద్ద మొత్తంలో విరాళాలు అందించి వీఐపీ బ్రేక్ దర్శనం పొందే...
Oktelugu Epaper