Homeఎంటర్టైన్మెంట్Heroes And Zeros : పేరుకే హీరోలు, మార్కెట్ పరంగా జీరోలు

Heroes And Zeros : పేరుకే హీరోలు, మార్కెట్ పరంగా జీరోలు

Heroes And Zeros: తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) ఒక నిర్మాత తనయుడు హీరో అవడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే, నిర్మాత వారసుల్లో పెద్దగా ఎవ్వరూ సక్సెస్ కాలేదు. వెంకటేష్ ఒక్కడే స్టార్ అయ్యాడు, కొన్నాళ్ళపాటు జగపతిబాబు కూడా లీడింగ్ హీరోగా చలామణి అయ్యాడు. ఇక ఈ ఇద్దరు తప్ప మిగతా నిర్మాతల పుత్రరత్నాలంతా హీరోగా మారే క్రమంలో కలిగే పురిటి నొప్పులనే భరించలేక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పారు. అయితే, నిర్మాత […]

Heroes And Zeros in Telugu Film IndustryHeroes And Zeros: తెలుగు సినీ పరిశ్రమలో (Telugu Film Industry) ఒక నిర్మాత తనయుడు హీరో అవడం అనేది సర్వసాధారణమైన విషయం. అయితే, నిర్మాత వారసుల్లో పెద్దగా ఎవ్వరూ సక్సెస్ కాలేదు. వెంకటేష్ ఒక్కడే స్టార్ అయ్యాడు, కొన్నాళ్ళపాటు జగపతిబాబు కూడా లీడింగ్ హీరోగా చలామణి అయ్యాడు. ఇక ఈ ఇద్దరు తప్ప మిగతా నిర్మాతల పుత్రరత్నాలంతా హీరోగా మారే క్రమంలో కలిగే పురిటి నొప్పులనే భరించలేక సినిమాలకు గుడ్ బాయ్ చెప్పారు.

అయితే, నిర్మాత బెల్లంకొండ సురేష్ పెద్ద కుమారుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas) మాత్రం ఇంకా హీరోనే కొనసాగుతున్నాడు. కానీ సాయి శ్రీనివాస్ పరిస్థితి ఏమిటో తెలిసిందే. అన్ని ఉన్నా.. సాయి శ్రీనివాస్ కి హీరో గుర్తింపు లేదు. కొన్ని సినిమాలు ఏవరేజ్ గా ఆడాయి కూడా. అయినా సాయి శ్రీనివాస్ ను మాత్రం ప్రేక్షకులు హీరోగా పరిగణలోకి తీసుకోవడం లేదు.

అసలు హీరో అంటే ఏమిటి ? సినిమా రిలీజ్ రోజు మినిమమ్ కలెక్షన్స్ ను రాబట్టే మార్కెట్ ఉండటం. కానీ, సాయి శ్రీనివాస్ కి ఇంకా ఆ మార్కెట్ రాలేదు. అయినప్పటికీ యాక్షన్ హీరో ఇమేజ్ కోసం ఈ బెల్లంకొండ హీరో బాక్సాఫీస్ వద్ద యుద్ధం చేస్తూనే ఉన్నాడు. ఈ క్రమంలోనే ‘ఛత్రపతి’ సినిమాని హిందీలోకి రీమేక్ చేస్తున్నాడు.

మరి బాలీవుడ్ ప్రేక్షకులు సాయి శ్రీనివాస్ ను హీరోగా మంచి పొజిషన్ లో నిలబెడతారా ? చూడాలి. అయితే, సాయి శ్రీనివాస్ పరిస్థితి ఇలా ఉంటే.. బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు గణేష్ తన జోరును రోజురోజుకు పెంచుకుంటూ పోతున్నాడు. తాజాగా గణేష్ హీరోగా తన మూడో చిత్రాన్ని మొదలు పెట్టాడు.

అసలు బెల్లంకొండ గణేష్ (Bellamkonda Ganesh) హీరోగా మొదలైన మొదటి రెండు సినిమాలే ఇంకా పూర్తి కాలేదు. ఆ రెండు చిత్రాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. అయినా గణేష్ మాత్రం తన మూడో చిత్రాన్ని లాంచ్ చేశాడు. ‘నాంది’ చిత్రాన్ని నిర్మించిన సతీష్ వేగేశ్న వర్మ ఈ చిత్రానికి నిర్మాత.

రాకేష్ ఉప్పలపాటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రానికి దర్శకుడు. మరి సాయి శ్రీనివాస్ కే మార్కెట్ లేకపోతే, ఇక గణేష్ గురించి చెప్పేది ఏముంది ?.. అంటే ఈ హీరోలు పేరుకే హీరోలు, మార్కెట్ పరంగా జీరోలు.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper