నకిలీ చలానాల కుంభకోణం కేసులో మరో ముగ్గురు సబ్ రిజిస్ట్రార్లను ఏపీ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. కృష్ణా జిల్లా మండవల్ల సబ్ రిజిస్ట్రార్ సుబ్రమణ్యం, విజయవాడ పటమట సబ్ రిజస్ట్రార్ వెంకటేశ్వర్లు, కడప సబ్ రిజిస్ట్రార్ లను అధికారులు విధుల నుంచి తప్పించారు. ఈ వ్యవహారంలో వీరితో పాటు 9 మంది సబ్ రిజిస్ట్రార్లను సస్పెండ్ చేసినట్లయింది. సబ్ రిజిస్ట్రార్ల సస్పెన్షన్ తో ఆయా కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు నిలిచిపోయాయి.