సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘మహర్షి’ లాంటి సూపర్ హిట్ సినిమా తీసిన తరువాత కూడా, పాపం ఛాన్స్ కోసం స్టార్ హీరోల చుట్టూ అలిసిపోయేలా తిరుగుతున్నాడు డైరెక్టర్ వంశీ పైడిపల్లి. ఓ దశలో ప్రభాస్, వంశీకి ఓకే చెప్పాడు అనే రూమర్ కూడా వినిపించింది. కానీ ప్రభాస్ వరుస సినిమాల బిజీతో వంశీతో వెంటనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేకపోయాడు. మరోపక్క హిట్స్ కొట్టిన స్టార్ డైరెక్టర్ అని కూడా చూడకుండా వంశీ పైడిపల్లికి మొహం చాటేశాడు మహేష్. నిజానికి మహేష్ నే పిలిచి మరీ వంశీకి ఛాన్స్ ఇచ్చాడు. కానీ వంశీ చెప్పిన కథ నచ్చక పరుశురాంకి ఓకే చెప్పి మహేష్ అటు వెళ్ళిపోయాడు.
Also Read..మహేశ్ బాబు నుండి పరుశురామ్ కి క్లారిటీ !
ఇక అప్పటినుండి వంశీ ఎందుకో సినిమా అంత త్వరగా సెట్ అవ్వట్లేదు. అందరి స్టార్ హీరోలు ఇప్పటికే వేరే సినిమాలతో బిజీగా ఉండటం కూడా ఒక కారణం కావొచ్చు. ఏదీ ఏమైనా వంశీకి మాత్రం అసలు టైం కలిసిరాలేదు. ఎంతో కష్టపడి రామ్ చరణ్ ను ఒప్పించినా ఇప్పుడు ఆ సినిమా కూడా డౌట్ గానే మిగిలిపోయింది. సినీ వర్గాల సమాచారం ప్రకారం రామ్ చరణ్ తన తరువాత సినిమాని దర్శకుడు సురేందర్ రెడ్డితో ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తోంది. సురేందర్ రెడ్డి చెప్పిన కథ చరణ్ కు బాగా నచ్చిందట. అందుకే ముందుగా సురేందర్ రెడ్డి సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని చరణ్ ప్లాన్ లో ఉన్నాడు.
Also Read..ఆర్ఆర్ఆర్ కు ముందే రాంచరణ్ సరికొత్త రికార్డు..!
మొతానికి వంశీ తన తదుపరి చిత్రాన్ని చరణ్ తో చేయాలని ముమ్మరంగా ప్రయత్నాలు చేసినా.. చరణ్ మాత్రం వంశీకి సినిమా ఇవ్వలేదు. పైడిపల్లి చెప్పిన కథ రామ్ చరణ్ కు నచ్చకపోవడం అందుకు కారణం అని బయటకు వచ్చిన వార్త. నిజానికి మహేష్, వంశీ సినిమాని పక్కన పెట్టెయ్యడానికి కూడా కథేనట మెయిన్ రీజన్. ఇక చేసేదేం లేక వంశీ మిగిలిన స్టార్ హీరోల చుట్టూ కథ పట్టుకుని మళ్లీ తిరగాల్సిందేనా. వంశీ లాస్ట్ మూవీ ‘మహర్షి’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ల వర్షం కురిపించడంతో పాటు హిందీ డబ్బింగ్ వర్షన్ కూడా మంచి హిట్ అయింది. అయినా వంశీకి మాత్రం ఆ హిట్ ఏ రకంగానూ ఉపయోగపడకుండా పోవడం బాధాకరమనే అనుకోవాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్