హుజురాబాద్ లో సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేసిన కౌశిక్ రెడ్డి మరో ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. దీంతో కాంగ్రెస్ లో ఆందోళనకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పార్టీ అధ్యక్షుడే ఓడిపోతామని చెబుతుంటే ఏం చేయాలని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు.
ఆ ఆడియో బయటకొచ్చింది. తాజాగా లీకైన ఆడియో కలకలం రేపుతోంది. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్ రెడ్డి హుజురాబాద్ మండలం కొత్తపల్లికి చెందిన కాంగ్రెస్ నాయకుడు తిరుపతికి ఫోన్ చేశారు. తాను ఏ తప్పు చేయలేదంటూ కాంగ్రెస్ నాయకులకు ఫోన్ చేసి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని కోరారు.
ఉప ఎన్నిక దగ్గర పడుతున్న నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ నాయకులు విస్తృతంగా ప్రచారం చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం వెనుకబడిపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు కష్టపడ్డామన్నారు. కానీ సుఖపడే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్పారు. మీరు సహకరిస్తే బాగుంటుందని పేర్కొన్నారు. తాను స్వయంగా వచ్చి కలుస్తానని చెప్పారు.
రాష్ర్ట పార్టీ అధ్యక్షుడే మనం ఓడిపోతున్నామని చెప్పడం సహించేదిగా లేదన్నారు. అందుకే అలా చేయాల్సి వచ్చిందని అన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ నేతలు రోజు తిరుగుతూ ప్రచారం చేస్తున్నారన్నారు. ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రచారం చేయడం లేదని పేర్కొన్నారు. ప్రచారం చేస్తామని చెప్పినా ఎవరు సహకరించలేదని అన్నారు. అందుకే పార్టీ కోసం పని చేయాలని సూచించినా పట్టించుకోకపోవడం విడ్డూరమన్నారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read More