Pushpa Movie: డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ” పుష్ప”. ఈ చిత్రంలో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా… మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ విలన్ గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఆర్య, ఆర్య 2 తర్వాత వీరిద్దరు కలిసి ఈ మూవీ తెరకెక్కిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. కాగా తాజాగా ఈ సినిమా నుంచి అభిమానులకు ఓ అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించారు.

పుష్ప చిత్రంలో అనసూయ ద్రాక్షాయని పాత్రలో నటిస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను రేపు ఉదయం 10:08 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఈ పోస్టర్ కోసం అనసూయ అభిమానుల్లో సందడి వాతావరణం మొదలైంది. రంగస్థలం లో తన నటనతో అందరినీ మెప్పించిన అనసూయ ఈ సినిమాతో ఎలా మ్యాజిక్ చేస్తారో అని ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘దాక్కో దాక్కో మేక’, ‘శ్రీవల్లి’, ‘సామి సామి’, పాటలు అభిమానులకు విపరీతంగా నచ్చేశాయి. కన్నడ నటుడు ధనుంజయ, అజయ్, సునీల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ సినిమా తొలి భాగం క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 17 వ తేదీన విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.