దేశంలోని పోస్టాఫీస్ లు ప్రజలకు ప్రయోజనం చేకూరేలా ఎన్నో స్కీమ్ లను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పోస్ట్ ఆఫీస్ సీనియర్ సిటిజన్లకు ప్రయోజనం చేకూరే విధంగా తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సీనియర్ సిటిజన్లు పోస్టాఫీస్ లకు వెళ్లకుండానే సులభంగా ఇంటినుంచే డబ్బులను విత్ డ్రా చేసుకోవచ్చు. తాజాగా ఇందుకు సంబంధించిన సర్క్యులర్ జారీ కావడం గమనార్హం. ఒక వ్యక్తికి అధికారం ఇవ్వడం ద్వారా లావాదేవీలను పూర్తి చేయవచ్చు.
సీనియార్ సిటిజన్లు పోస్ట్ ఆఫీస్ స్కీమ్ అకౌంట్లలో లావాదేవీలు చేయడానికి మరో వ్యక్తికి అధికారం ఇవ్వడం కొరకు కొన్ని జాగ్రత్తలను కచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం మొదట ఖాతాదారుడు sb – 12 అనే ఫారమ్ ను పూరించాల్సి ఉంటుంది. పోస్టాఫీస్ శాఖ ద్వారా ఈ ఫారంను పొందే అవకాశం ఉంటుంది. విత్డ్రా, లోన్, క్లోజర్, ఇతర లావాదేవీలకు ఈ ఫారమ్ అనుమతిస్తుంది.
ఖాతాదారులు ఫారమ్ ను పూరించి నగదు ఉపసంహరణ కొరకు sb – 7. ఖాతా మూసివేయాలనుకుంటే sb – 7b ఫారంను నింపాల్సి ఉంటుంది. ఆ తర్వాత పాస్ బుక్, ఫారమ్ లతో పాటు కేవైసీ పత్రాలను కచ్చితంగా సమర్పించాల్సి ఉంటుంది. ఆ తర్వాత పోస్టాఫీస్ ఉద్యోగులు తమ కంప్యూటర్ లో ఉన్న ఖాతాదారుల సంతకాల వివరాలతో సరిపోల్చుతారు. అది పర్యవేక్షకుడిచే ఆమోదించబడటంతో పాటు ఆ తర్వాతే చెల్లింపులు చేయబడతాయి.
పోస్టాఫీస్ పొదుపు ఖాతాలో డబ్బులను కేవలం నగదు రూపంలో మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అధీకృత వ్యక్తి పోస్ట్ ఆఫీస్ శాఖలో ఉద్యోగి లేదా ఏజెంట్గా ఉండరని గుర్తుంచుకోవాలి.