ఆంధ్రప్రదేశ్ లోని కడప నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కందుల శివానందరెడ్డి మృతి చెందారు. బుధవారం ఆయన గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యలు తెలిపారు. 1989లో కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచిన కందుల ఆ తరువాత టీడీపీలో చేరి 2004, 2009 ఎన్నికల్లో ఓడిపోయారు. కాగా వైఎస్ కుటుంబంతో 1977 నుంచి కందుల కుటుంబానికి రాజకీయ వైరం ఉండేది. వైఎస్ ఉన్నంతకాలం టీడీపీలో ఉన్న శివానందరెడ్డి ఆయన మరణాంతరం కాంగ్రెస్ లో చేరారు. రాష్ట్ర విభజనం అనంతరం మళ్లీ టీడీపీలో చేరారు. కాగా ఆయనకు కందుల గ్రూప్స్ పేరుతో విద్యాసంస్థలు ఉన్నాయి.