ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి జాతీయ హరిత ట్రైబ్యునల్(ఎన్జీటీ) షాకింగ్ తీర్పునిచ్చింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు ప్రాజక్టుల విస్తరణపై పర్యావరణ అనుమతులు తీసుకోవాలని స్పష్టం చేసింది. పర్యావరణ అనుమతులు లేనిది పనులు ముందుకు సాగించవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రాజెక్టులతో తాగునీటితో పాటు సాగునీటి అవసరాలు కూడా ఉన్నాయని అందువల్ల డీపీఆర్ సమర్పించి పర్యావరణ అనుమతులు తీసుకోవాలని సూచించింది.