YSR Jayanti 2026: రాష్ట్రవ్యాప్తంగా వైయస్ రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇడుపాలపాయలో రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన భార్య భారతి, తల్లి విజయమ్మ కూడా వచ్చారు. అందరూ కలిసి నివాళులు అర్పించారు. జగన్మోహన్ రెడ్డిని దగ్గరకు తీసుకొని ఆత్మీయంగా ముద్దాడారు విజయమ్మ. మరోవైపు ఈ వేడుకల్లో వైయస్ షర్మిల కనిపించలేదు. గత కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డిని ఆమె రాజకీయంగా విభేదిస్తున్నారు. అప్పటి నుంచి ప్రత్యేక సందర్భాల్లో కూడా వారు కనిపించలేదు కలిసి. అయితే ఈ విషయంలో విజయమ్మ అటు షర్మిల తో పాటు ఇటు జగన్మోహన్ రెడ్డితో సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే తండ్రి రాజశేఖరరెడ్డి ఆస్తికి సంబంధించి మాత్రం ఆమె కుమార్తె షర్మిల వైపు ఉంటున్నారు. ఇప్పటికే కుమారుడుకు వ్యతిరేకంగా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయినా సరే రాజశేఖర్ రెడ్డి జయంతి నాడు కుమారుడుతోనే ఆమె కలిసి నడవడం విశేషం.
* ఆస్తి వివాదాలు..
భారతి సిమెంట్స్ కంపెనీలో వాటాలకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఆ కంపెనీ షేర్లు విజయమ్మ కుమార్తె షర్మిలకు బదలాయించడానికి తప్పుపడుతూ జగన్మోహన్ రెడ్డి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ సందర్భంలో విజయమ్మ న్యాయస్థానానికి ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. లేఖ కూడా రాశారు. రాజశేఖర్ రెడ్డి తన ఇద్దరి పిల్లలకు సమానంగా ఆస్తిని పంచారని.. ఈ లెక్కన షర్మిలకు న్యాయం జరగాలని విజయమ్మ కోరుతున్నారు. ఈ క్రమంలో కుమారుడు జగన్మోహన్ రెడ్డితో ఆమెకు విభేదాలు ఉన్నట్లు టాక్ నడిచింది. కానీ విజయమ్మ తన భర్త రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు గాను కుమారుడు జగన్మోహన్ రెడ్డితో కలిసి రావడం ఇప్పుడు విశేషం. అదే సమయంలో షర్మిల ఎక్కడా కనిపించలేదు పులివెందులలో.
* అప్పట్లో కుటుంబం అంతా..
గతంలో రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి సమయంలో ఆయన కుటుంబమంతా ఏకతాటిపైకి వచ్చేది. సామూహికంగా అందరూ నివాళులు అర్పించేవారు. ఆపై సామూహిక ప్రార్ధనలు కూడా చేసేవారు.. కానీ కాలక్రమంలో ఆ కుటుంబంలో అనేక రకాల పరిణామాలు చోటు చేసుకున్నాయి. వివేకానంద రెడ్డి హత్య అంశం అనేది ఆ కుటుంబాన్ని అడ్డగోలుగా చీల్చింది. జగన్మోహన్ రెడ్డితో షర్మిల విభేదించడం కూడా ఒక కారణం. అందుకే రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలు కళ తప్పాయి. సగం మంది కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. అయితే కుమారుడిని విభేదిస్తున్నారని విజయమ్మ పై ఒక విమర్శ ఉంది. కానీ దానిని చూపించలేదు ఈ పర్యటనలో. కొడుకు, కోడలితో కలిసి విజయమ్మ నివాళులు అర్పించారు.
