Homeఆంధ్రప్రదేశ్‌YCP Leaders Attack : నిండు గర్భిణీ పై వైసీపీ నేతల దాడి.. ఎమ్మెల్యే భార్య...

YCP Leaders Attack : నిండు గర్భిణీ పై వైసీపీ నేతల దాడి.. ఎమ్మెల్యే భార్య సమక్షంలోనే దారుణం

YCP Attacks : వీధి దీపాలు వెలగడం లేదని ఫిర్యాదు చేయడం ఆమె తప్పు అయ్యింది. ఆమె ప్రశ్నించేసరికి అధికార వైసీపీ నేతలు తట్టుకోలేక పోయారు. నిండు చూలాలు అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. కిందపడేసి కాలితో తన్ని దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సతీమణి కవిత పార్టీ నాయకులతో కలిసి ప్రచారం చేస్తున్నారు. ఆదివారం మొలకలచెరువు మండలం వేపూరి కోట పంచాయితీ కోట గొల్లపల్లెలో ప్రచారం చేశారు. ఇంటింటా ప్రచారం చేసే క్రమంలో కళ్యాణి అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఇంటి ముందు వీధి దీపాలు వెలగడం లేదని.. రాత్రిపూట చిన్నారులు బయటి తిరగాలంటే భయం వేస్తోందని ఫిర్యాదు చేశారు. దీంతో సర్పంచ్ సుదర్శన రెడ్డి తో పాటు ఆయన అనుచరులు ఆమెతో వాదనకు దిగారు. భర్త మల్లికార్జున అడ్డుకోగా ఆయనపై దాడి చేశారు. అంతటితో ఆగకుండా నిండు గర్భిణీ అయిన కళ్యాణిని కింద పడేసి తొక్కేశారు. అయితే ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి సతీమణి కవిత అడ్డు చెప్పకపోవడం గమనార్హం.

అయితే వైసిపి నేతల దాడిలో కళ్యాణి అపస్మారక స్థితికి చేరుకుంది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన తరువాత కూడా వైసీపీకి చెందిన ఒక 20 మంది ప్రత్యేక వాహనాల్లో వచ్చి గ్రామంలో గలాటా సృష్టించారు. అప్పటికే పోలీసులకు సమాచారం అందడంతో వారు అక్కడకు చేరుకున్నారు. దీంతో వైసిపి నేతలు అక్కడ నుంచి వెళ్లిపోయారు. కాగా బాధితులు భయం భయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో గడిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని టిడిపి కోరుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Kargil Vijay Diwas

Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్.. 27 ఏళ్ల క్రితం ఏం జరిగింది.. భారత సైన్యం...

Kargil Vijay Diwas భారత సైన్యం పరాక్రమానికి.. తిరుగులేని పోరాటానికి సజీవ సాక్ష్యం కార్గిల్ విజయ్ దివస్. సరిగ్గా 27 సంవత్సరాల క్రితం భారత బలగాలు యుద్ధం చేశాయి. అద్భుతమైన విజయం సాధించాయి.....

YS Sharmila : ఆస్పత్రి బెడ్ మీద షర్మిల.. పరామర్శించడానికి జగన్ కు తీరికలేదు

YS Sharmila : ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అనారోగ్యానికి గురయ్యారు. ఆమె కొద్ది రోజులుగా పొత్తికడుపు నొప్పితో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమె శస్త్ర చికిత్స చేయించుకున్నట్టు తెలుస్తోంది. ఇదే...

Srinivasa Mangapuram : ‘శ్రీనివాస మంగపురం’ మొట్టమొదటి రివ్యూ.. ఈ రేంజ్ లో ఉంటుందని ఊహించలేదు..

Srinivasa Mangapuram : రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరో గా నటించిన 'శ్రీనివాస మంగపురం' చిత్రం ఈ నెల 30 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల...
Abhishek Sharma

Abhishek Sharma : 1, 8, 2.. గంభీర్ తో పాటు ఇతడినీ షెడ్డు కు పంపించాల్సిందే..

Abhishek Sharma : ఆడుతోంది జింబాబ్వే మీద. వాళ్ల బౌలింగ్ అంత గొప్పగా ఉండదు. అలాంటప్పుడు స్వేచ్ఛగా ఆడుకోవచ్చు. సరికొత్త రికార్డులు సృష్టించుకోవచ్చు. అవసరమైతే దూకుడుగా బ్యాటింగ్ చేయవచ్చు. కానీ ఇతడు ఏం...
Oktelugu Epaper