Pawan Kalyan : ఈనెల 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయిన్ కోసం అలుపు లేకుండా తిరుగుతున్నాడు. ఇక మొత్తానికైతే ఆయన గత నెల రోజుల నుంచి ఎక్కడ విశ్రాంతి తీసుకోకుండా తన పార్టీ మెంబర్స్ ను ఎలాగైనా సరే గెలిపించుకోవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు తిరుపతిలో జరిగే విజయభేరి యాత్రలో పాల్గొనడానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ రేణుగుంట ఎయిర్ పోర్ట్ కి చేరుకున్నారు.
ఇక ఆయన నిదానంగా నడుస్తూ తన కాన్వాయ్ ఎక్కే సమయంలో ఆయన కాలుకు పట్టి కనిపించింది. అయితే ఆయన కాలు కి గాయం అయిందనే విషయం దాన్ని చూస్తే చాలా స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఈ గాయం గురించి పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీ మెంబర్స్ కానీ ఎవరూ కూడా ఏ రకంగానూ స్పందించలేదు. కాబట్టి అది చిన్న గాయమా లేదంటే పెద్ద గాయమైంది కానీ పవన్ కళ్యాణ్ ఆ విషయాన్ని బయటికి తెలియనివ్వ కుండా దాస్తున్నాడా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.
ఇక ఇది ఇలా ఉంటే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ గాయాన్ని చూసి చాలా బాధపడిపోతున్నారు. ఆయన కాలికి తగిలిన గాయం నుంచి ఆయన తొందరగా కోలుకోవాలని కామెంట్లను కూడా చేస్తున్నారు. ఇక మొత్తానికైతే పవన్ కళ్యాణ్ తన హెల్త్ గురించి కూడా ఆలోచించకుండా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తను నిర్వహించే ప్రోగ్రామ్స్ అన్నింటికీ అటెండ్ అవుతూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాడు.
అలాగే ప్రతి కార్యకర్త కూడా జనసేనకి ఓటు ఎందుకు వేయాలో దాని గురించి కూడా చాలా స్పష్టంగా వివరిస్తూ ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాడు. ఇక ఈ మధ్య పవన్ కళ్యాణ్ నిర్వహించిన అన్ని సభలు కూడా సూపర్ సక్సెస్ అవుతున్నాయి. ఇక పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈసారి భారీ మెజార్టీతో గెలవబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే నిర్వహించిన అన్ని సర్వేల్లో కూడా పవన్ కళ్యాణ్ కి భారీ మెజార్టీ వస్తుందని తెలుస్తుంది…