Quantum Valley In Amaravati: అమరావతి రాజధాని( Amravati capital ) నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అమరావతికి కొత్త కళ వచ్చింది. ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా అమరావతిని తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రణాళిక వేశారు. అందులో భాగంగా ప్రపంచం చూసే విధంగా నిర్మాణాలు జరుగుతున్నాయి. గతంలో ఐటీ పరంగా హైదరాబాద్ కు చంద్రబాబు గుర్తింపు తీసుకొచ్చారు. ఇప్పుడు అదే మాదిరిగా అమరావతిని నేలపాలని చూస్తున్నారు. ఇప్పుడిప్పుడే ప్రపంచం ఆలోచిస్తున్న క్వాంటం టెక్నాలజీని ముందుగానే అమరావతిలో తీసుకొచ్చి.. దేశంలోనే అగ్రగామిగా నిలపాలన్నది చంద్రబాబు ప్రణాళిక. ఈరోజు ఆ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సీఎం చంద్రబాబు ప్రారంభించనున్నారు. అమరావతికి ఇదో మణిహారంగా నిలవనుంది. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవంతో అమరావతికి కొత్త కళ రావడం ఖాయం.
* సరికొత్త విప్లవం..
క్వాంటం కంప్యూటింగ్( Quantum computing) అనేది కంప్యూటర్ టెక్నాలజీలో ఓ సరికొత్త విప్లవం. ఇప్పుడు మనం వాడుతున్న కంప్యూటర్లలో చాలావరకు 64 బిట్ తో పనిచేస్తాయి. తొలుత 32 బిట్ ఉండేది. క్రమేపి దాని బలం పెంచుతూ 64 బిట్ కు దాని స్థాయిని పెంచారు. అయితే దానికి మించి ఇప్పుడు క్వాంటం కంప్యూటర్ పనిచేయనుంది. ఇది చాలా వేగవంతమైనది. ఒకేసారి కొన్ని కోట్ల పనులను కంప్యూటర్లు వేగంగా చేసేందుకు.. క్వాంటం కంప్యూటింగ్ ఎంతగానో దోహదపడనుంది. అయితే టెక్నాలజీ రంగంలో క్వాంటం అనేది సరికొత్త విప్లవం. దానిని ముందుగానే గుర్తించారు సీఎం చంద్రబాబు. ఫుల్ ఫోకస్ చేశారు. ఐటీ రంగం అనేది పాతది. అందుకే కొత్తగా క్వాంటం కంప్యూటింగ్ ను ఒడిసి పట్టుకున్నారు చంద్రబాబు.
* దేశంలోనే మొదటి 133 క్యూబిట్ కంప్యూటర్ ఇది. దీనిని తొలిసారిగా అమరావతికి తెస్తారు.
* క్వాంటం వ్యాలీ నిర్మాణంలో IBM, TCS, L&T సంస్థలు పాల్గొంటాయి.
* 50 ఎకరాల్లో ఈ వ్యాలీలో ఉంది. ఇందులో క్వాంటం కంప్యూటింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, సెన్సార్, ఫైనాన్స్, డిఫెన్స్, హెల్త్ కేర్ రంగాల్లో ఇక్కడ పరిశోధనలు జరుగుతాయి.
* ఆగస్టు నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేయాలన్నది లక్ష్యం. డిసెంబరు నాటికి క్వాంటం కంప్యూటర్ని తెస్తారు.
* ప్రస్తుతం బోస్టన్, సింగపూర్ వంటి ప్రాంతాల్లోనే క్వాంటం హబ్ లు ఉన్నాయి. అమరావతి కూడా వాటి సరసన చేరనుంది.
* ప్రపంచవ్యాప్తంగా ఏఐ టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో ముందుగానే దానిని అందిపుచ్చుకోవాలి అన్నది చంద్రబాబు ప్రణాళిక.
* ఈరోజు శంకుస్థాపన
అమరావతి రాజధాని లో ఈరోజు ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. తుళ్లూరు మండలంలోని ఉద్దండరాయునిపాలెంలో అమరావతి క్వాంటం వ్యాలీ ఐకానిక్ భవన నిర్మాణానికి సీఎం చంద్రబాబు, కేంద్ర ఐటీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి జితేంద్ర సింగ్ శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం నుంచి కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. సాయంత్రం 6 గంటలకు శంకుస్థాపన చేయనున్నారు
