Homeఆంధ్రప్రదేశ్‌Jana Sena : జనసేన రాజ్యసభ పదవి ఆయనకే!

Jana Sena : జనసేన రాజ్యసభ పదవి ఆయనకే!

Jana Sena : జనసేన( janasena ) రాజ్యసభ పై ఫోకస్ పెట్టిందా? అక్కడ ప్రాతినిధ్యం పెంచుకోవాలని చూస్తోందా? వచ్చే ఏడాది రాజ్యసభ లో ఆ పార్టీ అడుగుపెట్టనుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. 2026 జూన్ లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ అవుతున్నాయి. అందులో ఒకటి జనసేనకు కేటాయించడం గ్యారెంటీ అని చెబుతున్నారు కూటమి నేతలు. ఇప్పటివరకు రాజ్యసభ పదవులను జనసేన తీసుకోలేదు. అందుకే వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ పదవుల్లో.. ఒకటి జనసేన తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. ఆ పదవిని సైతం ఓ ప్రముఖ పారిశ్రామికవేత్తకు ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.

Also Read : జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం హాజరు కాబోతుందా..? వివాదాలకు చెక్ పెట్టనున్న అల్లు అర్జున్!

* ఆ ఒక్క లోటు
మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ( general elections ) సంపూర్ణ విజయం సాధించింది జనసేన. టిడిపి తో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. అన్నింటా గెలిచింది. రెండు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి సంపూర్ణ విజయం సాధించింది. మరోవైపు ఎన్నికల ఫలితాల అనంతరం రెండు ఎమ్మెల్సీ సీట్లను సాధించింది. ఆ పార్టీ నుంచి ఇద్దరు శాసనమండలిలో అడుగుపెట్టారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాలో కీలక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్నారు. ఆ పార్టీకి చెందిన నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్ మంత్రులుగా ఉన్నారు. త్వరలో నాగబాబు సైతం మంత్రివర్గంలోకి రానున్నారు. అలా జనసేన అన్ని చట్టసభల్లో ప్రాతినిధ్యం పెంచుకుంటూ వచ్చింది. ఒక్క రాజ్యసభ సీటు విషయంలో మాత్రం వచ్చే ఏడాది వరకు వేచి చూడక తప్పదు. వచ్చే ఏడాది జూన్లో ఖాళీ అయ్యే నాలుగు స్థానాల్లో ఒకటిని తీసుకోవడం ద్వారా.. రాజ్యసభ లోటును కూడా తీర్చుకోనుంది జనసేన.

* వచ్చే ఏడాది జూన్ లో నాలుగు ఖాళీ..
వచ్చే ఏడాది జూన్లో ఏపీ( Andhra Pradesh) నుంచి నలుగురు రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. అందులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ముగ్గురు. కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభ పదవులు గెలుచుకునే బలం లేదు. అందుకే ఆ నాలుగు పదవులు టిడిపి కూటమికి దక్కే అవకాశం ఉంది. వైసీపీకి చెందిన పిల్లి సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, గుజరాత్ కు పరిమళనత్వాని ఉన్నారు. గత ఏడాది రాజ్యసభకు ఎన్నికైన టిడిపి సభ్యుడు సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. సతీష్ ఎంపికై తక్కువ రోజులు కావడంతో ఆయన మరోసారి నామినేట్ కానున్నారు. నత్వాని ఖాళీ చేసిన స్థానాన్ని బిజెపి తీసుకొనుంది. మిగిలిన రెండు సీట్లను జనసేన ఒకటి, టిడిపి ఒకటి తీసుకోనుంది.

* లింగమనేని రమేష్ కు అవకాశం..
అయితే జనసేన నుంచి తొలిసారిగా రాజ్యసభలో( Rajya Sabha ) అడుగు పెట్టేది పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ అని ప్రచారం జరుగుతోంది. ఆయన పవన్ కళ్యాణ్ కి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. ఆయనకు తప్పకుండా రాజ్యసభ పదవి ఇస్తారని తెలుస్తోంది. ఆయన కోసమే నాగబాబును ఎమ్మెల్సీగా పంపించారని కూడా తెలుస్తోంది. మరోవైపు లింగమనేని రమేష్ సైతం తెలుగుదేశం పార్టీకి అత్యంత సన్నిహితుడు. అందుకే ఆయన విషయంలో టిడిపి నుంచి ఎటువంటి అభ్యంతరాలు ఉండవు. దీంతో జనసేన నుంచి రాజ్యసభలో అడుగు పెట్టేది లింగమనేని రమేష్ అని తేలిపోయింది. ఏవైనా ప్రత్యేక పరిస్థితులు వస్తే కానీ.. ఆయన ఎంపిక లాంఛనమేనని తెలుస్తోంది. ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Also Read : టీడీపీ-జనసేన కూటమికి ‘రెబల్స్’ భయం

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular