spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Jagan: జగన్ పై కేంద్రం సీరియస్!

Jagan: జగన్ పై కేంద్రం సీరియస్!

Jagan: రాష్ట్రాల రాజధానుల అంశం అనేది ఆ రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టం పై ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకోదు కూడా. అందుకే అమరావతి రాజధాని విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చినా కేంద్రం పెద్దగా స్పందించిన దాఖలాలు లేవు. 2014లో టిడిపి అధికారంలోకి వచ్చింది. అందరి ఏకాభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేసింది. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమరావతికి శంకుస్థాపన జరిగింది. అయితే వైసిపి వచ్చిన తర్వాత అమరావతి పై స్టాండ్ మారింది. అయినా కేంద్రం కానీ.. ప్రధాని కానీ కలుగజేసుకోలేదు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగన్ పై మాత్రం కేంద్ర పెద్దలు ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది.

* అప్పట్లో అలా..
2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది తెలుగుదేశం. అప్పట్లో బీజేపీ వైఖరిని విపరీతంగా వ్యతిరేకించారు చంద్రబాబు. దానిని జగన్మోహన్ రెడ్డి క్యాష్ చేసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఘన విజయం సాధించారు జగన్. ఎన్డీఏ లో నేరుగా వైసీపీ చేరలేదు కానీ అంతకుమించి ప్రయోజనం, స్వేచ్ఛ లభించింది జగన్మోహన్ రెడ్డికి. అయితే అమరావతి విషయంలో చంద్రబాబుకు క్రెడిట్ దక్కకూడదు అనేది జగన్మోహన్ రెడ్డి భావన. అందుకే అమరావతి పై పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. కానీ కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. దానికి రాజకీయ కారణాలు అన్నది లేకపోలేదు. ఆపై రాష్ట్ర ప్రభుత్వాల హక్కులపై కలుగజేసుకోకూడదు అనే నిబంధన కూడా ఉంది.

* రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా..
కానీ ఇప్పుడు అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అమరావతికి కేంద్ర ప్రభుత్వం 15000 కోట్ల రూపాయల నిధులను సమకూర్చింది. రైల్వే తో పాటు రోడ్ల ప్రాజెక్టులను మంజూరు చేస్తోంది. 12 ప్రభుత్వ బ్యాంకులకు సంబంధించిన నిర్మాణాలు జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించి భవనాల ఏర్పాటుకు కసరత్తు ప్రారంభం అయింది. దాదాపు 50 వేల కోట్ల రూపాయలతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో మావిగన్ అని జగన్మోహన్ రెడ్డి ప్రకటన చేశారు. అమరావతికి తాను వ్యతిరేకం అని తేల్చి చెప్పారు. ప్రజలు తీర్పు స్పష్టంగా ఇచ్చిన.. అమరావతి రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్న ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడుకుంటున్నారు. అందుకే కేంద్రం జగన్మోహన్ రెడ్డి తీరుపై సీరియస్ గా ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మరి అందులో ఎంత నిజం ఉందో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Most Popular

Sujeeth Director

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ ని చూసి వణికిపోతున్న పవన్ ఫ్యాన్స్.. ఇలా అయితే కష్టమే..

Sujeeth Director: డైరెక్టర్ సుజిత్ తో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అనుబంధం మామూలుది కాదు. ఒక సాధారణ పవన్ కళ్యాణ్ వీరాభిమాని గా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన సుజిత్ ,...
Jr NTR

Jr NTR: నిరాశలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. ఆ సినిమా రద్దు అయ్యినట్టేనా!

Jr NTR: ప్రస్తుతం మన టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ తర్వాత , క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే , అది జూనియర్...
Chiranjeevi

Chiranjeevi: చిరంజీవి విషయంలో లైట్ తీసుకున్న స్టార్ డైరెక్టర్స్…

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలనే కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ప్రతి దర్శకుడు ఇండస్ట్రీకి రావడానికి ముందే చిరంజీవి సినిమాలను చూసి వచ్చినవారే కాదా విశేషం.. ఇండస్ట్రీ లో సక్సెస్...
Vijay Deverakonda Vs Naveen Polishetty

Vijay Deverakonda Vs Naveen Polishetty: విజయ్ దేవరకొండ vs నవీన్ పోలిశెట్టి… పోటీ మామూలుగా లేదుగా…

Vijay Deverakonda Vs Naveen Polishetty: సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోల మధ్య ఎంత మంచి ఫ్రెండ్షిప్ ఉన్నప్పటికి సినిమాల విషయంలో వాళ్ళ మధ్య తీవ్రమైన పోటీ అయితే ఉంటుంది. పర్సనల్ విషయాల్లో...
Nagababu Jabardasth

Nagababu Jabardasth: ‘జబర్దస్త్’ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత నాగబాబు ఒక్కో ఎపిసోడ్ కి తీసుకునే రెమ్యూనరేషన్...

Nagababu Jabardasth: గత 13 సంవత్సరాల నుండి ఎలాంటి విరామం లేకుండా ఈటీవీ లో దిగ్విజయంగా సాగుతున్న షో ఏదైనా ఉందా అంటే , అది 'జబర్దస్త్' మాత్రమే. ఈ బిగ్గెస్ట్...
Oktelugu Epaper