spot_img
Homeఆంధ్రప్రదేశ్‌Amaravati Central Government: 'అమరావతి' పై మారిన కేంద్రం వైఖరి!

Amaravati Central Government: ‘అమరావతి’ పై మారిన కేంద్రం వైఖరి!

Amaravati Central Government: అమరావతి రాజధాని కి కట్టుబడి ఉన్నట్లు కేంద్రం మరోసారి నిరూపించుకుంది. పార్లమెంటులో అమరావతికి చట్టబద్ధత కల్పించిన సంగతి తెలిసిందే. తాజాగా అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కేంద్ర క్యాబినెట్. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలతో పాటు సిబ్బందికి సంబంధించిన వాటర్స్ నిర్మాణానికి దాదాపు 2500 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించింది కేంద్రం. నిజంగా ఇది గొప్ప పరిణామం. అమరావతి విషయంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేస్తూనే ఉంది. చివరకు చట్టబద్ధతను సైతం ఎగతాళి చేశారు జగన్మోహన్ రెడ్డి. అయితే కేంద్రం జగన్మోహన్ రెడ్డికి ధీటైన సమాధానం చెబుతోంది. భారీగా నిధులు కేటాయించి.. అమరావతి విషయంలో తనకున్న చిత్తశుద్ధిని చాటుకుంటోంది. ఇది నిజంగా గొప్ప పరిణామం. ఎందుకంటే అమరావతిలో కేంద్ర ప్రభుత్వ శాఖలన్నీ ఒకే కాంప్లెక్స్ లోకి రానున్నాయి. అత్యాధునిక హంగులతో దాదాపు 1250 కోట్ల రూపాయల వ్యయంతో దీనిని నిర్మించాలని చూస్తోంది కేంద్ర ప్రభుత్వం.

* గతానికి భిన్నంగా..
ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత గతానికి భిన్నంగా వ్యవహరించింది అమరావతి విషయంలో. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ అందరి ఆమోదంతో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసింది. రాజధాని నిర్మాణ పనులను అప్పటి ప్రధాని స్వయంగా శంకుస్థాపన చేశారు. భవన నిర్మాణ పనులు కూడా ప్రారంభం అయ్యాయి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడు రాజధానుల అంశం తెరపైకి వచ్చింది. అప్పుడు కూడా కేంద్రం నుంచి ఎటువంటి అభ్యంతరాలు రాలేదు. పైగా జగన్మోహన్ రెడ్డికి కేంద్రం మద్దతు ఉందని.. మూడు రాజధానులకు జై కొట్టిందంటూ అప్పట్లో ప్రచారం చేశారు. అయితే రాష్ట్ర రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వపరంగా అప్పట్లో జోక్యం చేసుకోలేదు. కానీ బిజెపి రాజకీయ పార్టీ పరంగా మాత్రం దానిపై అభ్యంతరం వ్యక్తం చేసింది.

* భారీగా నిధుల కేటాయింపు..
జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులను నిర్మించలేకపోయారు. అధికారికంగా ప్రకటనకు కూడా ధైర్యం చేయలేకపోయారు. కానీ కూటమి వచ్చిన తరువాత గతానికి భిన్నంగా వ్యవహరించింది కేంద్ర ప్రభుత్వం. అమరావతి రాజధాని నిర్మాణానికి ఏకంగా 15 వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. రోడ్డు, రైల్వే ప్రాజెక్టులను సైతం కేటాయించింది అమరావతికి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఆర్థిక శాఖకు సంబంధించిన బ్యాంకుల ప్రధాన కార్యాలయాలను ఒకే చోట నిర్మిస్తోంది. ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వ శాఖలకు సంబంధించిన కార్యాలయాల సముదాయాన్ని ఏర్పాటు చేస్తోంది అమరావతిలో. అంతటితో ఆగకుండా అధికారులతో పాటు ఉద్యోగులు నివాసం ఉండే వీలుగా క్వార్టర్స్ సైతం నిర్మిస్తోంది. తద్వారా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విషప్రచారంపై మోడీ సర్కార్ తన నిధులతో గట్టిగానే సమాధానం చెబుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular