HomeతెలంగాణTelangana Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు గట్టి షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్

Telangana Teachers: ప్రభుత్వ ఉపాధ్యాయులకు గట్టి షాక్ ఇచ్చిన రేవంత్ సర్కార్

Telangana Teachers: విద్యా శాఖను తనవద్దే ఉంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశాలు పెంచడంతోపాటు హాజరు శాతం పెంచేలా మధ్యాహ్నం భోజనం నాణ్యతతో ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. బోధనలో నాణ్యత పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఉపాధ్యాయుల గైర్హాజరుపై దృష్టిపెట్టారు. ఇష్టానుసారంగా హాజరు కాకుండా ఉండే టీచర్లు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అనుమతి లేకుండా నిరంతరం ఏడాది పాటు డ్యూటీకి రాకపోతే సర్వీస్‌ నుంచి తొలగింపు, ఐదేళ్లు ఆబ్సెంట్‌గా […]

Telangana Teachers: విద్యా శాఖను తనవద్దే ఉంచుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవస్థను గాడిలో పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రవేశాలు పెంచడంతోపాటు హాజరు శాతం పెంచేలా మధ్యాహ్నం భోజనం నాణ్యతతో ఉండేలా పర్యవేక్షిస్తున్నారు. బోధనలో నాణ్యత పెంచేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నారు. తాజాగా ఉపాధ్యాయుల గైర్హాజరుపై దృష్టిపెట్టారు. ఇష్టానుసారంగా హాజరు కాకుండా ఉండే టీచర్లు, సిబ్బందిపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. అనుమతి లేకుండా నిరంతరం ఏడాది పాటు డ్యూటీకి రాకపోతే సర్వీస్‌ నుంచి తొలగింపు, ఐదేళ్లు ఆబ్సెంట్‌గా ఉంటే రాజీనామా చేసినట్లు పరిగణించడం వంటి నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు.

అనుమతి లేకుంటే ఔటే..
అనుమతి లేకుండా ఏడాది పాటు నిరంతరం డ్యూటీకి హాజరు కాకపోతే నిబంధనల ప్రకారం సర్వీస్‌ నుంచి తొలగించాలని స్పష్టం చేశారు. ఐదేళ్లు పాటు ఆబ్సెంట్‌గా ఉన్నవారిని రాజీనామా చేసినట్లు భావించి చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. ఇది ఇప్పటికే ఉన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలన్న సంకేతం. గతంలో ఇలాంటి కేసుల్లో జాప్యం జరిగేది. ఇప్పుడు అలా జరగకూడదని స్పష్టం చేశారు.

బాధ్యత ఎవరిది
హెడ్‌మాస్టర్లు, ఎంఈవోలు, డీఈవోలు ఇలాంటి కేసుల్లో చర్యలు తీసుకోవడంలో జాప్యం చేస్తే వారినే బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంటే కేవలం ఆబ్సెంట్‌ టీచర్‌పైనే కాదు, పై అధికారులపైనా ఒత్తిడి పెరుగుతుంది. ఇది వ్యవస్థలో జవాబుదారీతనం పెరగడానికి దోహదం చేస్తుంది. స్థానిక స్థాయిలో నిర్లక్ష్యం జరిగితే పై స్థాయి వరకూ బాధ్యత విస్తరిస్తుంది.

వ్యవస్థను గాడిలో పెట్టాలని..
స్కూళ్లలో టీచర్లు హాజరు కాకపోతే విద్యార్థుల చదువు ప్రభావితమవుతుంది. గ్రామీణ, మార్జినల్‌ ప్రాంతాల్లో ఇలాంటి నిర్లక్ష్యం మరింత తీవ్రంగా కనిపిస్తుంది. విద్యాశాఖ ఈ చర్య ద్వారా డిసిప్లిన్‌ను పెంచాలని, పని సంస్కృతిని మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అనవసర గైర్హాజరులు తగ్గితే స్కూళ్లలో సాధారణ పనితీరు మెరుగుపడుతుంది. అదే సమయంలో నిజమైన అనారోగ్యం లేదా ఇతర సమస్యలతో ఉన్నవారికి సరైన విధానం ఉండాలని కూడా గుర్తుంచుకోవాలి.

అమలులో సవాళ్లు..
నిబంధనలు ఉన్నా అమలు సక్రమంగా జరగకపోతే ప్రయోజనం ఉండదు. ఆబ్సెంట్‌గా ఉన్నవారి రికార్డులు సరిగా నిర్వహించడం, సకాలంలో నోటీసులు జారీ చేయడం, విచారణ పూర్తి చేయడం వంటివి కీలకం. అధికారులు జాప్యం చేస్తే వారిపైనా చర్యలు తీసుకుంటామన్నందున, ఇప్పుడు స్థానిక స్థాయి నుంచి జవాబుదారీతనం పెరగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి చర్యలు సరైన విచారణ తర్వాతే జరగాలి. నిర్దోషులపై తప్పుడు చర్యలు జరగకుండా జాగ్రత్తలు అవసరం.

ఈ నిర్ణయం కేవలం కాగితాల్లోనే ఉండకుండా, ఆచరణలోకి రావాలి. స్కూళ్లలో హాజరు పర్యవేక్షణను బలోపేతం చేయడం, డిజిటల్‌ హాజరు వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించడం, సకాలంలో చర్యలు తీసుకోవడం వంటివి అవసరం. అదే సమయంలో టీచర్లకు సరైన వసతులు, మద్దతు అందించడం ద్వారా స్వచ్ఛందంగా హాజరు పెరిగేలా చూడాలి. కఠిన చర్యలు ఒకవైపు, సానుకూల వాతావరణం మరోవైపు ఉండాలి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

Related News

Most Popular

Oktelugu Epaper