HomeతెలంగాణKonda Surekha : కొండా సురేఖ ఇష్యూలో కీలక మలుపు..

Konda Surekha : కొండా సురేఖ ఇష్యూలో కీలక మలుపు..

– బుజ్జగింపులకు దిగిన కాంగ్రెస్ హైకమాండ్? Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమెకు కేబినెట్ హోదా కలిగిన కీలక పదవి ఇచ్చే అంశాన్ని ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం. సురేఖను వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం […]

– బుజ్జగింపులకు దిగిన కాంగ్రెస్ హైకమాండ్?

Konda Surekha : తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కొండా సురేఖ వ్యవహారం ఆసక్తికర మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సురేఖను బుజ్జగించేందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రయత్నాలు ప్రారంభించినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగా ఆమెకు కేబినెట్ హోదా కలిగిన కీలక పదవి ఇచ్చే అంశాన్ని ఢిల్లీ పెద్దలు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

సురేఖను వెంటనే ఢిల్లీకి రావాలని అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం సురేఖతో ఫోన్‌లో మాట్లాడినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ తీసుకునే నిర్ణయాన్ని గౌరవించాలని, ప్రస్తుత పరిస్థితుల్లో అధిష్ఠానంతో సమన్వయం చేసుకోవాలని ఆమెకు సూచించినట్లు సమాచారం.

అనుచరులతో కీలక భేటీ

ఈ నేపథ్యంలో కొండా సురేఖ ఇవాళ హన్మకొండలో తన అనుచరులు, ముఖ్య కార్యకర్తలతో సమావేశం కానున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పిలుపు, అధిష్ఠానం ప్రతిపాదిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న అంశాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై ఆమె వారితో చర్చించే అవకాశం ఉంది. సురేఖకు ఏ పదవి ఇవ్వబోతున్నారు? దాని ద్వారా ఆమెను ఎలా సముదాయించబోతున్నారు? అనే అంశాలు ప్రస్తుతం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.

కేబినెట్ హోదాతో కూడిన పదవి ఇస్తే అది ఏదనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. నామినేటెడ్ పదవా? లేక ప్రభుత్వంలో కీలక బాధ్యతా? అనే చర్చ కూడా జరుగుతోంది. అయితే దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

కార్యకర్తల సమావేశంలో సురేఖ కీలక వ్యాఖ్యలు

ఇదిలా ఉంటే కార్యకర్తలతో జరిగిన సమావేశంలో కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ తాను ఏనాడూ వెనక్కి తగ్గలేదనే భావనను ఆమె వ్యక్తం చేశారు.

“ఆ రోజు మహానీయుడు రాజశేఖర్ రెడ్డి గారి కోసం రాజీనామా చేసినా.. ఏ రోజు బాధపడలేదు. అప్పట్లో జగన్ గారి పార్టీలో చేరాం. తెలంగాణ వచ్చిన తర్వాత తప్పని పరిస్థితుల్లో బయటకు వచ్చాం” అని సురేఖ వ్యాఖ్యానించారు.

ఈ వ్యాఖ్యలు ఆమె రాజకీయ ప్రయాణంలోని కీలక దశలను గుర్తుచేసేలా ఉన్నాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ఉన్న అనుబంధం, అనంతరం వైఎస్ జగన్ నేతృత్వంలోని పార్టీలో చేరడం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలు.. ఇలా తన ప్రయాణాన్ని సురేఖ కార్యకర్తల వద్ద ప్రస్తావించారు.

ఢిల్లీ నిర్ణయంపైనే ఉత్కంఠ

ప్రస్తుతం సురేఖ వ్యవహారంలో కాంగ్రెస్ హైకమాండ్ తీసుకునే నిర్ణయంపైనే ఉత్కంఠ నెలకొంది. ఆమెను ఢిల్లీకి పిలిపించి చర్చించిన తర్వాత ఏ బాధ్యత అప్పగిస్తారనేది కీలకంగా మారింది. మరోవైపు, తన అనుచరులతో సమావేశమైన అనంతరం సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ అధిష్ఠానం ఒకవైపు అసంతృప్తిని చల్లార్చేందుకు ప్రయత్నిస్తుండగా.. మరోవైపు సురేఖకు కీలక పదవి ఇవ్వడం ద్వారా ఆమెకు రాజకీయంగా ప్రాధాన్యం కొనసాగించే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తుది నిర్ణయం ఢిల్లీలో జరిగే చర్చల తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Oktelugu Epaper