Beer price Increase in Telangana
Telangana : తెలంగాణ(Telangana)లో ఎండలు మండిపోతున్నాయి. శీతాకాలంలోనే భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ప్రస్తుతం 30 నుంచి 32 డిగ్రీల సెల్సియస్గా ఉష్ణోగ్రతలు నమోదు కావాలి. కానీ 35 డిగ్రీలకుపైగా నమోదవుతున్నాయి. ధీంతో ప్రజలు వేసవి తాపంతో ఇబ్బంది పడుతున్నారు. చల్లని నీళ్లు, శీతల పానీయాలు(Coll Drinks), బీర్లు లాగించేస్తున్నారు. ఇలాంటి తరుణంలో తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. బీర్ల ధరలు 15 శాతం పెంచుతూ మంగళవారం(Tuesday)(ఫిబ్రవరి 11న) రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ధరలు తక్షణం అమలులోకి వస్తాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. బీర్ల ధరల పెంపుతో ప్రభుత్వానికి రూ.700 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరుతుందని ఎక్సైజ్ శాఖ అంచనా వేస్తోంది. ఎండల తీవ్రత ఇలాగే కొనసాగితే నాలుగు నెలల్లో బీర్ల విక్రయం పెరిగి ప్రభుత్వానికి మరింత ఎక్కువ ఆదాయం సమకూరుతుంది.
ధరల పెరుగుతల ఇలా..
ఇక ఎక్సైజ్ శాఖ నిర్ణయం ప్రకారం… బీర్లలో ఏ బీరు ధర ఎంత పెరుగుతుంది అని మందుబాబులు ఆతృతగా ఎదురు రూస్తున్నారు. ఈ క్రమంలో బ్రాండును బట్టి బీర్ల ధరలు పెరుగనున్నాయి. లైట్ బీర్(Lite beer)ధర ప్రస్తుతం రూ.150 ఉండగా, కొత్త ధర ప్రకారం దాని రేటు రూ.172కు పెరుగుతుంది. ఇక స్ట్రాంగ్ ప్రీమియం ధర ప్రస్తుతం రూ.160 ఉండగా, దానిని రూ.184కు పెంచారు. బడ్వైజర్ లైట్ బీరు ధర ప్రస్తుతం రూ210 ఉండగా, రూ.241.5కు, కింగ్ ఫిషర్ అల్ట్రా మ్యాక్స్ ధర రూ.230 నుంచి రూ.253కు పెరిగింది. బడ్వైజర్ మ్యాగ్నం ధర రూ.220 ఉండగా పెంచిన తర్వాత రూ.253కు చేరింది. టూబర్గ్ స్ట్రాంగ్ రూ.240 నుంచి రూ.276కు పెరిగింది.
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Excise department increases beer prices in telangana
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com