ఘోర రోడ్డు ప్రమాదం : 7గురు మృతి
వికారాబాద్ జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7గురు అక్కడికక్కడే మృతి చెందారు. జిల్లాలోని మోమిన్ పేటలో జరిగిన ఈ సంఘటన సమాచారం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదంలో మరికొంత మంది గాయపడ్డారు వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగా ఆర్టీసీ బస్సు, లారీ, ఆటో ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.