Rohit , Dhoni
Rohit and Dhoni : టీమ్ ఇండియా టెస్ట్ ఫార్మాట్ కు రోహిత్ వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ కు సంబంధించిన ఒక విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. అది టీమిండియా లెజెండరీ కెప్టెన్ ధోనితో సంబంధం ఉండడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. ధోని ఆగస్టు 15, 2020 న రిటైర్మెంట్ ప్రకటించాడు. దానికంటే ముందు 2013లో టీమిండియా ధోని ఆధ్వర్యంలో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది.. అతడు తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ స్వదేశంలో ముంబైలోని వాంఖడే మైదానంలో ఆడాడు. విదేశాలలో అయితే ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ మైదానంలో తన చివరి టెస్ట్ ఆడాడు. తన రిటర్మెంట్ నిర్ణయాన్ని సాయంత్రం 7:29 గంటలకు ప్రకటించాడు.. ఆ తర్వాత అతడు క్రికెట్లోని అన్ని ఫార్మాట్ ల నుంచి తప్పుకున్నాడు. ఇక ఇదే విధానం రోహిత్ శర్మ విషయంలోనూ కొనసాగింది. క్రికెట్ లో ఇది యాదృచ్ఛికమైనప్పటికీ.. ఇటువంటి సంఘటనలు గతంలో ఏ క్రికెటర్ల విషయంలోనూ జరగకపోవడం గమనార్హం.
Also Read : ధోని అభిమానులకు షాక్: ఉత్తమ కెప్టెన్ గా రోహిత్ శర్మ
రోహిత్ శర్మ విషయంలో..
రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే అతని ఆధ్వర్యంలో టీమిండియా 2025లో దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచింది. స్వదేశంలో రోహిత్ శర్మ ముంబైలోని వాంఖడే మైదానంలోనే అతడు తన చివరి టెస్ట్ ఆడాడు. ఇక ఆస్ట్రేలియాలో బీజీటీ లో భాగంగా మెల్బోర్న్ వేదికగా జరిగిన మ్యాచ్ ద్వారా విదేశాలలో తన చివరి టెస్ట్ ఆడాడు. టెస్టులలో తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా వేదికగానే వెల్లడించినప్పటికీ.. ఇప్పటికీ సమయం సాయంత్రం 7 గంటల 29 నిమిషాలు కావడం విశేషం. మొత్తంగా అటు ధోని.. ఇటు రోహిత్ టెస్ట్ ఫార్మాట్ కు వీడ్కోలు పలికే క్రమంలో ఇద్దరు ఒకే తరహా విధానాలు అవలంబించడం విశేషం. ఇటువంటి ఘటనలు ఇంతవరకు క్రికెట్లో చోటు చేసుకోలేదు. భవిష్యత్ కాలంలో చోటుచేసుకుంటాయో లేదో తెలియదు. కాకపోతే టీమిండియా రోహిత్ కెప్టెన్సీలో టి20 వరల్డ్ కప్ విన్ అయింది. ఛాంపియన్స్ ట్రోఫీ దక్కించుకుంది. ఆసియా కప్ ట్రోఫీలను కూడా అందుకుంది. రెండుసార్లు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ ఫైనల్స్ వెళ్లినప్పటికీ.. విజేతగా మాత్రం నిలవలేకపోయింది. ఇక 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ స్వదేశం వేదికగా ఓటమిపాలైంది. ఒకవేళ టీం ఇండియా ఈ కప్ కనుక గెలిస్తే రోహిత్ శర్మ నాయకుడిగా అద్భుతమైన రికార్డు సాధించేవాడు.ఇక 2023లో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ స్వదేశం వేదికగా ఓటమిపాలైంది. ఒకవేళ టీం ఇండియా ఈ కప్ కనుక గెలిస్తే రోహిత్ శర్మ నాయకుడిగా అద్భుతమైన రికార్డు సాధించేవాడు.
Also Read : “RO” ను కలిసిన అర్సీబీ ఆటగాడు.. ఇన్ స్టా లో ఏం పోస్ట్ చేశాడంటే..
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rohit retirement dhoni relationship
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com