ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ కోల్పోయింది. ఫైనల్ దాకా వచ్చినప్పటికీ.. చివరి పోటీలో ఆస్ట్రేలియా ముందు తలవంచింది.. ఒత్తిడి తట్టుకోలేక కంగారులకు దాసోహం అయింది. టీమిండియా కు వన్డే వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా చాలామంది క్రికెటర్లు ఆడుతున్నారు. అందులో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ అయితే టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించడమే తన జీవిత ఆశయమని అనేక సందర్భాల్లో చెప్పాడు. చివరికి ఆ కలను సాధించడానికి అతడు బరువు తగ్గాడు. మేనేజ్మెంట్ చెప్పినట్టు ఒప్పుకున్నాడు. సారధిగా వ్యవహరించిన చోట ఆటగాడిగా మారిపోయాడు.
టీమిండియా లో వన్డే ఫార్మాట్ కి సంబంధించి లోపాలు ఏమిటో ఇటీవల బయటపడ్డాయి. ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా వన్డే సిరీస్ కోల్పోవడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. తొలి వన్డే గెలిచినప్పటికీ.. మిగతా మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయింది. సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కచ్చితంగా 50 ఓవర్ల ఫార్మాట్ లో సత్తా చూపించాల్సిన సందర్భం ఏర్పడింది.
వచ్చే వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుంది. అక్కడి మైదానాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆటగాళ్లు దూకుడుతో పాటు.. సమయమనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు సమర్ధవంతంగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. పరుగులు తీయాలి.. అదే సమయంలో వికెట్లు కాపాడుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా కాచుకోవాలి. ఇదంతా జరగాలంటే ఆటగాళ్లలో సామర్థ్యం ఉండాలి. రోహిత్ విషయంలో ఇబ్బంది లేదు. గిల్ విషయంలో కూడా ఇబ్బంది లేదు. కానీ ఈ రెండు వికెట్లు వెంటనే పోతే.. తదుపరి బ్యాటర్ల మీద ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తగ్గాలంటే గిల్ స్థానంలో వైభవ్ సూర్య వంశీ రావాలని మెజారిటీ అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు కూడా ఇదే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.
నిన్న ముగిసిన జింబాబ్వే సిరీస్లో వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు. వరుస హాఫ్ సెంచరీలతో సత్తా చూపించాడు. అంతేకాదు.. బౌన్సీ మైదానాల మీద తిరుగులేని ఆట తీరు కొనసాగించాడు. ఈ నేపథ్యంలో అతడు ఆడుతున్న తీరు చూసి సీనియర్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని.. ఇదే అనువైన సమయమని చెబుతున్నారు.. మాజీ క్రికెటర్ ఫారుక్ ఇంజనీర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జాతీయ జట్టులోకి వైభవ్ ను తీసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయమని.. అతడు గ్యాస్ మధ్యలో ఆడతాడని.. వేగంగా పరుగులు తీస్తాడని.. అందువల్లే మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి తగ్గుతుందని.. తద్వారా ఎక్కువ పరుగులు తీయడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఇంజనీర్ అభిప్రాయపడ్డాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ.. నాలుగో స్థానంలో గిల్ ను పంపిస్తే టీమిండియా 2027 వన్డే వరల్డ్ కప్ టాస్క్ పూర్తి అవుతుందని.. ఇంజనీర్ అభిప్రాయపడ్డాడు.





