Today horoscope telugu : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం ద్వాదశ రాశులపై పుష్య నక్షత్ర ప్రభావం ఉంటుంది. దీంతో వ్యాపారులకు అనుకూలమైన వాతావరణం ఉండడంతో గణనీయమైన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అదనపు ఆదాయాన్ని పొందుతారు. మేషంతో సహా మీనం వరకు మొత్తం రాశుల ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం..
మేష రాశి (అశ్విని, భరణి,1,2,3,4) : ఈ రాశి వారికి ఈ రోజు ఉద్యోగుల సహకారం ఉండటంతో అనుకున్న పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. విద్యార్థులు ఉన్నత చదువుకుల కోసం విదేశాలకు వెళ్లేందుకు ప్రయత్నిస్తారు. వీరికి గురువుల మద్దతు ఉంటుంది. ఉద్యోగం కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఈరోజు శుభవార్తలు అందుతాయి. వ్యాపారులకు కుటుంబ సభ్యుల సహకారం ఉండటంతో అనుకున్న లాభాలు పొందుతారు.
వృషభరాశి( కృత్తిక 2,3,4 రోహిణి) : ఈ రాశి వ్యాపారులు ఈరోజు శుభవార్తలు వింటారు. గతంలో కంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. కొత్తగా పెట్టుబడును పెట్టే వారికి ఇదే మంచి అవకాశం. రాజకీయాల్లో ఉండే వారికి ప్రజల మద్దతు ఉంటుంది. మాట్లాడే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు చేస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి.
మిథున రాశి( మృగశిర 3,4 అరుద్ర): ఈ రాశి అర్హులైన వారికి వివాహ పుష్పాలను వచ్చే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనవసరం ఖర్చులు పెరుగుతాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో పెద్దల సలహా తీసుకోవాలి. అధికారుల నుంచి ప్రశంసలు అందుతాయి. వ్యాపారులు మెరుగైన ఫలితాలు సాధిస్తారు. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి.
కర్కాటక రాశి(పునర్వసు 4, పుష్యమి, అశ్లేష) : . ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి ఇదే మంచి సమయం. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. నాణ్యమైన ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. స్నేహితుల సహకారంతో ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు.
సింహా రాశి( ముఖ, పుబ్బ, ఉత్తర 1) : ఈ రాశి వారు ఈరోజు కొన్ని పనులు పూర్తి కావాలంటే కష్టపడాల్సి వస్తుంది. పూర్వికులు ఆస్తికి సంబంధించి శుభవార్తలు వింటారు. వ్యాపారులకు సమయం అనుకూలంగా ఉండడంతో కొత్తగా పెట్టుబడులు పెట్టే వారికి అనుకూలంగా ఉంటుంది. గతంలో కంటే ఇప్పుడు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
కన్యరాశి(ఉత్తర 2,3,4 హస్త చిత్త 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు గణనీయమైన లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఆగిపోయిన డబ్బు తిరిగి వసూలు అవుతుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు. వ్యాపారులకు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో కరణీయమైన లాభాలు ఉంటాయి. కష్టానికి తగిన ప్రతిపాదం ఉంటుంది. కొత్తగా ఆదాయం సమకూరుతుంది.
తుల రాశి(చిత్త 3,4, స్వాతి: విశాఖ 1,2,3) : ఈ రాశి వ్యాపారులకు ఈరోజు సరైన వాతావరణ ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. అర్హులైన వారికి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. ఉద్యోగులు తెలివిని ప్రదర్శించడంతో పదోన్నతి వచ్చే అవకాశం ఉంటుంది. లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్న వారు వాటిని పూర్తి చేసేందుకు కష్టపడతారు.
వృశ్చిక రాశి(విశాఖ 4, అనురాధ, జ్యేష్ఠ) : ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు. బ్యాంకు నుంచి రుణం తీసుకుంటారు. సమాజంలో గౌరవం లభించడంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షల పాల్గొంటే విజయం సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలమైన వాతావరణంలో పదోన్నతులు వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ధనస్సు రాశి ( మూల, పుర్వాషాఢ, ఉత్తరాషాడ 1) :. బ్యాంకింగ్ రంగంలో వారికి శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన ఫలితాలు ఉంటాయి. అనవసరపు ఖర్చులు జోలికి వెళ్ళకండి.
మకర రాశి (ఉత్తరాషాఢ 2,3,4 శ్రవణం, ధనిష్ఠ 1,2) : . ఈ రాశి వారికి ఈ రోజు అనేక రంగాల్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కెరీర్ పై దృష్టి పెడతారు. వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోకుండా దూర ప్రయాణాలు చేయాల్సివస్తే సొంత వాహనాలపై వెళ్లకుండా ఉండాలి. పెద్దల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
కుంభ రాశి (ధనిష్ఠ 3,4 శతభిష పూర్వాభాద్ర 1,2,3) : ఈ రాజు వారు ఈరోజు ఆర్థిక ప్రణాళికలు వేస్తారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. నిరుద్యోగులు సువార్తలు వింటారు. అనుకోకుండా వ్యాపారులకు ఆదాయం పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల మద్దతు ఉండడంతో అదనపు ప్రయోజనాలు ఉంటాయి. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
మీనరాశి (పూర్వాభద్ర 4, ఉత్తరాభాద్ర రేవతి ) : . . ఈ రాశి వారు ఈ రోజు రాజకీయాల్లో రాణిస్తారు. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. గతంలో కంటే ఇప్పుడు మెరుగైన లాభాలు పొందుతారు. రాజకీయాల్లో ఉండే వారికి అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతిని పొందే అవకాశం ఉంటుంది.