ఆంధ్రప్రదేశ్‌Bhogapuram Airport: దశాబ్ధాల కల.. ‘భోగాపురం’ ఎయిర్ పోర్ట్’కు ముందూ.. వెనుక.. ఏం జరిగింది?

Bhogapuram Airport: దశాబ్ధాల కల.. ‘భోగాపురం’ ఎయిర్ పోర్ట్’కు ముందూ.. వెనుక.. ఏం జరిగింది?

Bhogapuram Airport : భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం.. దశాబ్దాలుగా వినిపిస్తున్న మాట ఇది. ఇప్పటికీ భూసేకరణకు మించి ఒక అడుగు ముందుకుపడలేదు. నిర్వాసితులకు పునరావాసం కల్పించలేదు. పూర్తిస్థాయి పరిహారం అందించలేదు. కానీ ముచ్చటగా రెండోసారి శంకుస్థాపనలకు సిద్ధపడుతుండడం మాత్రం నివ్వెరపరుస్తోంది. బుధవారం ఎయిర్ పోర్టు నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. రూ.4592 కోట్లతో నిర్మించనున్న ఎయిర్ పోర్టును 36 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు.

నాలుగేళ్ల కిందట శంకుస్థాపన..
అయితే ఈ ఎయిర్ పోర్టుకు గతంలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2019ఫిబ్రవరి 15న చంద్రబాబు భూమిపూజ చేశారు. అదేరోజు విశాఖ కాపులుప్పాడలో రూ 70వేల కోట్లతో లక్ష మందికి ఉపాధి లక్ష్యంతో అదానీ డేటా సెంటర్ టెక్ పార్క్ కు శంకుస్థాపన చేశారు. విజయనగరం జిల్లాలో పతంజలి ఫుడ్ పార్క్ కు,  172ఎకరాల్లో విజయనగరం మెడికల్ కాలేజీకి, 129ఎకరాల్లో గురజాడ వర్సిటీకి శ్రీకారం చుట్టారు. అయితే ఇంతలో ఎన్నికలు రావడం, వైసీపీ అధికారంలోకి రావడం జరిగిపోయింది. కానీ నాలుగేళ్లు పట్టించుకోని జగన్ సర్కారు.. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి శంకుస్థాపనలకు దిగుతుండడం విమర్శలకు తావిస్తోంది.

నాడు విపక్ష నేతగా..
చంద్రబాబు సర్కారు 2,700 ఎకరాల్లో ఎయిర్ పోర్టును ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ జగన్ సర్కారు దానాని ఇప్పుడు 2200ఎకరాలకు కుదించింది. వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ-380 కూడా ఈజీగా ల్యాండ్ అయ్యే విధంగా 3.8కిమీ రన్ వేకు అప్పట్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం విశాఖ  ఎయిర్ పోర్టు నేవీ ఆధ్వర్యంలో నడుస్తోంది, పార్కింగ్ స్పేస్ లేక వచ్చిన విమానం వచ్చినట్లే వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి..వీటన్నింటికీ పరిష్కారంలా భోగాపురంలో భారీ పార్కింగ్ స్పేస్ కు ప్లానింగ్ చేశారు, మెయింటెనెన్స్ వర్క్ షాప్ కూడా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ నాడు విపక్ష నేతగా ఉన్న జగన్ నిర్వాసితులను రెచ్చగొట్టారు. భూములు ఇవ్వొద్దని సూచించారు. తాను అధికారంలోకి వస్తే ఇచ్చిన భూములను వెనక్కి ఇస్తానని ప్రకటించారు. కానీ ఇప్పుడు నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా, నష్టపరిహారం అందించకుండా శంకుస్థాపనలకు సిద్ధపడుతుండడం మాత్రం సర్వత్రా విమర్శలకు కారణమవుతోంది.

ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై ఫోకస్…
రాష్ట్ర విభజన తరువాత ఏపీలో ఎయిర్ పోర్టుల అభివృద్ధిపై చంద్రబాబు సర్కారు ప్రత్యేకంగా దృష్టిపెట్టింది. ఆ 4ఏళ్లలోనే ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 4రెట్లు పెరిగింది. 1.3మిలియన్ నుంచి 5.5మిలియన్లకు పాసింజర్లు పెరిగారు, సిఏజిఆర్ 38% పెరిగింది..రాష్ట్ర విభజన అనంతరం ఏపిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విశాఖపట్నం ఒక్కటే. దీంతో పాటు విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా అభివృద్ధి చేశారు. అయితే విమానాల జంక్షన్ గా మార్చాలన్న ఉద్దేశ్యంతో భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణానికి అడుగులు వేశారు. అప్పట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు ఉండడంతో వడివడిగా అడుగులు పడ్డాయి. కానీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు. ప్రస్తుతం అతి కష్టమ్మీద నిర్వాసితులను గ్రామాల నుంచి పంపించారు. 36 నెలల్లో లక్ష్యంగా పెట్టుకున్నా.. అది ఎన్నికల స్టంటేనన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

Related News

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ కు ‘ఆర్టీసీ’ శుభవార్త!

Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోడీ జాతికి అంకితం చేయనున్నారు. నిజంగా ఇది ఉత్తరాంధ్ర ప్రజలకు శుభవార్త. మరోవైపు విశాఖలో విమానాశ్రయం...

Most Popular

Divvela Madhuri

Divvela Madhuri: దువ్వాడను అడ్డంగా బుక్ చేసిన జాఫర్.. ఇచ్చిపడేసిన దివ్వెల మాధురి..వీడియో వైరల్..

Divvela Madhuri: సోషల్ మీడియా లో బాగా పాపులారిటీ ని సంపాదించుకున్న జంటలలో దువ్వాడ శ్రీనివాస్ - దివ్వెల మాధురి జంట ఒకటి. పొలిటికల్ నేపథ్యం ఉన్నటువంటి దువ్వాడ శ్రీనివాస్ తన భార్య...
Delhi Protests

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...
Pawan Kalyan

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ కోడి చెరువు కబ్జాపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన

Pawan Kalyan: కొద్దిరోజుల క్రితం కొంతమంది స్వయంప్రకటిత, తెలంగాణ వాదులు, సో కాల్డ్ జర్నలిస్టులు.. యూట్యూబర్లు.. రచ్చ రచ్చ చేశారు. కోడి చెరువును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కబ్జా చేశారని విమర్శలు...
Jagan

Jagan: కేంద్ర పెద్దల అపాయింట్మెంట్ కోరిన జగన్.. ఏంటి కథ?!

Jagan: మద్యం కుంభకోణం ఏపీలో ప్రకంపనలు సృష్టించింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ కుంభకోణం జరిగింది. అయితే దీనిపై ఏర్పాటైన సీట్ విచారణ తుది దశకు వచ్చింది. అంతిమ లబ్ధిదారుడు ఎవరు...
Bhogapuram Airport Opening

Bhogapuram Airport Opening: ఆ రైతులకు ఉచిత విమాన ప్రయాణం!

Bhogapuram Airport Opening: ఉత్తరాంధ్రలో కీలక ఘట్టానికి సమయం ఆసన్నం అవుతోంది. ఆగస్టు 1న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కానుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఎయిర్పోర్టును జాతికి అంకితం చేయనున్నారు....