Homeజాతీయ వార్తలుHyderabad Real Estate : దేశమంతా సొమ్మసిల్లితే హైదరాబాద్‌లో రియల్ భూమ్ ఎందుకు పుంజుకుంది? అసలు...

Hyderabad Real Estate : దేశమంతా సొమ్మసిల్లితే హైదరాబాద్‌లో రియల్ భూమ్ ఎందుకు పుంజుకుంది? అసలు కారణమేంటి?

Hyderabad Real Estate : కరోనా కల్లోలంతో కుదేలైన రియాల్టీ రంగానికి ఇప్పుడు కొత్త ఊపు వచ్చింది. ఇప్పుడిప్పుడే మళ్లీ ఊపందుకుంటోంది. దేశంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం విస్తరిస్తోంది. మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజిల్లుతోంది. మన రాష్ర్ట రాజధాని హైదరాబాద్ లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. దేశంలో రియల్ బూమ్ ఏర్పడినా ఇక్కడ మాత్రం జోరు తగ్గలేదు. ఫలితంగా కోట్లాది రూపాయల లావాదేవీలు జరుగుతూ దేశంలోనే అత్యధిక భూమ్ కలిగిన నగరంగా వినతికెక్కుతోంది. మొదటి స్థానంలో ముంబయి నిలవగా దాని తరువాత స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇతర టాప్ 7 నగరాలతో పోలిస్తే హైదరాబాద్ సిటీ రెసిడెన్షియల్ మార్కెట్ 171% పెరిగి సత్తా చాటింది. అన్ని రంగాలలో హైదరాబాద్ దూసుకుపోతోంది.

ఎక్కువ మంది జనాభా కలిగి ఉన్న ఒక నగరంపై విశ్వాసానికి రియల్ ఎస్టేట్ అనేది ప్రధాన సూచికగా పనిచేస్తుంది. కుటుంబాలు మాత్రమే కాదు, వీరిలో ప్రధాన భాగం మధ్యతరగతి వారు, కష్టపడి సంపాదించిన డబ్బును తమకంటూ ఒక గూడు ఏర్పరుచుకోవడానికి చూస్తారు. పెట్టుబడిదారులు, బిల్డర్లు, బ్యాంకర్లు, ముడిసరుకు వంటి వారి విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. సరఫరాదారులు.. ఇతర అనుబంధ విభాగాల వారికి రియల్ ఎస్టేట్ తో బోలెడంత ఉపాధి లభిస్తుంది.

ఇతర భారతీయ రియల్ ఎస్టేట్ నగరాల కంటే హైదరాబాద్ ముందంజలో ఉంది. హైదరాబాద్ ప్రాపర్టీ ఇండస్ట్రీ తన స్థానాన్ని పదే పదే బలోపేతం చేసుకుంటోంది. పటిష్టమైన విధాన రూపకల్పన.. దాని వృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు కారణంగా హైదరాబాద్‌ రియల్ ఎస్టేట్ భూమ్ మళ్లీ మొదలైంది. ప్రపంచ ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం దిగజారిపోతున్నా.. కోవిడ్ -19 మహమ్మారి ప్రభావం చూపినా.. రియల్టీ రంగం ప్రస్తుతం హైదరాబాద్ లో మళ్లీ జోరందుకోవడం విశేషం. కరోనా వేళ కునారిల్లిన రియల్ ఇండస్ట్రీ ఇప్పుడు జోరుగా సాగుతోంది.

లాక్‌డౌన్‌లో.. కోవిడ్ మహమ్మారితో హైదరాబాద్ లో గత రెండేళ్లుగా రియల్ భూమ్ ను కొంచెం తగ్గించగలిగింది. కానీ దేశంలోనే కాకుండా ప్రపంచంలోని చాలా అభివృద్ధి చెందిన దేశాలలో కూడా అనేక ఇతర మెట్రో సెంటర్‌లలో కూడా రియల్ ఎస్టేట్ రంగం ఇలానే దారుణంగా పడిపోయింది. కానీ రెండేళ్లలోనే హైదరాబాద్ లో రియల్ భూమ్ మళ్లీ మొదలుకావడం విశేషం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మహమ్మారి నుండి వేగంగా కోలుకుంది. కొత్తగా అభివృద్ధి చెందుతున్న ప్రదేశాలతోపాటు నిర్మాణ కార్యకలాపాలు జోరందుకున్నాయి..

రియల్ ఎస్టేట్ -ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్‌లో ప్రత్యేకత కలిగిన ప్రముఖ వృత్తిపరమైన సేవల సంస్థ జేఎల్ఎల్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం.. ‘హైదరాబాద్ 2008 రెండో త్రైమాసికం నుండి అత్యధిక త్రైమాసిక అమ్మకాలను చూసింది. బలమైన నివాస విక్రయాలను నమోదు చేసింది.’ అనేక మంది ప్రముఖ డెవలపర్‌లు పశ్చిమ శివారు ప్రాంతాల్లో తమ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించడంతో 2022 రెండో త్రైమాసికంలో 24 శాతం అమ్మకాలు పెరిగాయని జేఎల్ఎల్ నివేదిక నొక్కి చెప్పింది. తెల్లాపూర్, నల్లగండ్ల మరియు కొండాపూర్‌లోని పశ్చిమ శివారు సబ్‌మార్కెట్‌లో హైదరాబాద్‌లో అత్యధిక విక్రయాలు జరిగాయని తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ జేఎల్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. రూ. 1 కోటి నుండి రూ. 1.5 కోట్ల మధ్య ధర కలిగిన రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ యూనిట్లలో అత్యధిక విక్రయాలు నమోదయ్యాయి. 2022లో తొలి త్రైమాసికంలో 9549 రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ యూనిట్లు విక్రయించబడ్డాయి. 2021తో పోల్చితే హైదరాబాద్ లో 39 శాతం వృద్ధిని సాధించింది”అని ఆయన చెప్పారు. అంతేకాకుండా రెండో త్రైమాసికంలో 2008 తర్వాత హైదరాబాద్‌లో అత్యధిక త్రైమాసిక విక్రయాలు ఈ సీజన్ లో జరగడం విశేషం. రెసిడెన్షియల్ విభాగంలో అధిక ఆసక్తి ఉన్నందున రెండవ త్రైమాసికంలో రెసిడెన్షియల్ మార్కెట్ 53,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది, ఇది 2021 రెండో క్వార్టర్ తో పోలిస్తే ఈ సంవత్సరానికి 171 శాతం పెరిగింది. కోవిడ్ మహమ్మారి నియంత్రణ.. కొనుగోలుదారుల విశ్వాసం మార్కెట్‌కు తిరిగి శక్తివచ్చిందని.. అందుకే పెరుగుతున్న డిమాండ్‌ను ఇది ప్రతిఫలిస్తుందని తెలిపారు.

అన్ని ప్రధాన నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో అత్యధికంగా 38 శాతం వృద్ధిని సాధించింది. అలాగే సంవత్సరానికి సంబంధించిన గణాంకాలను పోల్చినట్లయితే, ఇది 2022 రెండో త్రైమాసికంలో 75 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది, దీంతో యూనిట్ల విక్రయం 2021 రెండో త్రైమాసికంలో 3,157 నుండి 2022 రెండో త్రైమాసికంలో 5,537కి పెరిగింది. అలాగే ప్లాట్లు మరియు విల్లా విభాగంలో 6,013 రెసిడెన్షియల్ యూనిట్లు.. 2022 క్వార్టర్ 2లో టాప్ ఏడు నగరాల్లో విక్రయించబడ్డాయి. వీటిలో త్రైమాసిక విక్రయాలలో 28 శాతం హైదరాబాద్‌కు చెందినది. ఈ విభాగంలో 1700 రెసిడెన్షియల్ యూనిట్లు విక్రయించబడ్డాయి.

ఇన్‌పుట్ ఖర్చులు మరియు బలమైన డిమాండ్ పెరుగుదల మూలధన విలువలతో రెసిడెన్షియల్ ధరలు పెరగడానికి కారణమయ్యాయి. ఇది హైదరాబాద్ మినహా అన్ని నగరాల్లో 3 శాతం నుండి 7 శాతం మాత్రమే పెరుగుదలను చూపుతుంది. హైదరాబాద్ లో మాత్రం రెండంకెల ధరల వృద్ధిని సాధించింది. ఐటీ రంగం.. స్టార్టప్‌లలో ఏర్పడిన ఉపాధి అవకాశాలు హైదరాబాద్‌లోని రెసిడెన్షియల్ మార్కెట్‌ను నడిపిస్తున్నాయని, ఎస్‌ఆర్‌డీపీ ద్వారా నగరంలోని మౌలిక సదుపాయాలపై పెట్టుబడి పెట్టడం వల్ల నగరంలోని ఉత్తర, తూర్పు ప్రాంతాలలో కొత్త రెసిడెన్షియల్ క్లస్టర్‌లు పుట్టుకొచ్చి రియల్ భూమ్ విస్తరించిందని రెసిడెన్షియల్ అమ్మకాలను పెంచడానికి ఇదే దోహదపడిందని తెలిపారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular