Power Distribution Companies : దేశంలోని విద్యుత్తు పంపిణీ సంస్థలు ఎలా పనిచేస్తున్నాయో ప్రతీ సంవత్సరం విద్యుత్ శాఖ మంత్రి ఒక ర్యాంకింగ్స్ ఇస్తారు. సంస్థల పనితీరు ఎలావుంది? అంచనా వేస్తారు? బాగా లేదు అనుకునేవారు వచ్చే సంవత్సరం ఇంప్రూవ్ చేసుకుంటారని పోటీ వాతావరణం సృష్టించారు. టాప్ లో ఉన్న సంస్థలు దిగజారితే సమీక్ష చేసుకోవడానికి అవకాశం కల్పించారు. అందుకే మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఈ ర్యాంకింగ్స్ ఇస్తుంది.
దేశం మొత్తం మీద 55 డిస్కంలు ఉన్నాయి. ఇందులో 42 ప్రభుత్వ రంగ సంస్థలున్నాయి. ఒక 13 ప్రైవేటు రంగంలో ఉన్నాయి. ప్రైవేటు ఎక్కడ ఉన్నాయని చూస్తే.. గుజరాత్, ఒడిశా, ఢిల్లీ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, యూపీ, దాద్రా నగర్ హవేలి, డయ్యూ డమాన్ లలో ప్రైవేటు సంస్థలున్నాయి.
ఇందులో ఢిల్లీ, ఒడిశా, దాద్రా నగర్, డయ్య డమన్ లలో పూర్తిగా విద్యుత్ పంపిణీ ప్రైవేటులో ఉన్నాయి. మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నాయి.
దేశంలోని విద్యుత్తు పంపిణీ సంస్థల పనితీరు ఎలావుంది? అన్న దానిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు..