భారతదేశ మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్ పేయి 92వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి నివాళులర్పించారు. ఢిల్లీలోని వాజ్ పేయి సమాధి వద్ద శుక్రవారం ఉదయం కాసేపు గడిపారు. ఆయతో పాటు కేంద్ర మంత్రలు, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ‘భారతదేశానికి వాజ్ పేయి చేసిన సేవలు ఎన్నటికి గుర్తుండిపోతాయి. ఆయన దూరద్రుష్టి దేశ అభివ్రుద్ధికి దోహదపడింది.‘ అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. 1924లో జన్మించిన వాజ్ పేయి జనసంఘ్ వ్యస్థాపక సభ్యుడు. ఆ తరువాత బీజేపీలో చేరి దేశ ప్రధాని స్థాయికి ఎదిగారు.