దేశ వ్యాప్తంగా భారత్ బంద్ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం తన పుట్టిన రోజు సందర్భంగా ఎవరూ వేడుకలు నిర్వహించవద్దని కోరింది. అందరూ భారత్ బంద్ లో పాల్గొనాలని కోరింది. రైతులకు అన్యాయం చేస్తున్న కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోలన తెలపాలని కోరింది. కేంద్ర వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకునే వరకు కాంగ్రెస్ నాయకులు ఆందోళన విరమించవద్దని తెలిపారు. కాగా దేశ వ్యాప్తంగా సాగుతున్న బంద్ లో భాగంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నేటితో రైతుల ఆందోళన 13వ రోజుకు చేరింది.