
తెలంగాణలో రాష్ట్రంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత నాలుగైదు రోజుల నుంచి కేసుల సంఖ్య పెరుగుతోంది. వైద్య, ఆరోగ్యశాఖ మంగళవారం వారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కొత్తగా 682 కరోనా కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే ముగ్గురు మృతి చెందారు. దీంతో ఇప్పటి వరకు కేసుల సంఖ్య 2,74,540 గా ఉంది. ఇక మరణాల సంఖ్య 1,477గా ఉన్నట్లు బులిటెన్లో పేర్కొంది. ఇక ఇప్పటి వరకు 2,65,367 మంది కోలుకోగా ప్రస్తుతం 7,696యాక్టివ్ కేసులు ఉన్నాయి. వీరిలో 5,634 మంది ఇంట్లో చికిత్స పొందుతున్నారు. కాగా 24 గంటల్లో 55,645 కరోనా టెస్టులు నిర్వహించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.