
భారత్ లో కరోనా కేసులు కోటి మార్కును దాటేశాయి. రోజువారీ కేసుల్లో తగ్గుముఖం పట్టినా మొత్తంగా కోటి సంఖ్యను దాటింది. దేశంలో తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం తెలిపిన బుటిటెన్ ప్రకారం కొత్తగా 25,152 కరోనా కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో 347 మంది మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,00,04,599గా నమోదైంది. ఇక ఇప్పటివరకు మృతుల సంఖ్య 1,45,136కి చేరింది. ప్రస్తుతం దేశంలో 3,08,751యాక్టివ్ కేసులు ఉండగా కోలుకున్న వారిసంఖ్య 95,50,712గా ఉంది. ఇక ఐసీఎంఆర్ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు మొత్తం 16 కోట్ల పరీక్షలు చేసినట్లు తెలిపింది.